Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
రాత్రి మిగిలిన పప్పును పారేస్తున్నారా? ఒక్కసారి ఇలా దాల్ పరాఠా ట్రై చేయండి, లొట్టలేస్తారు!
మనలో చాలా మంది ఇళ్లలో తరచుగా రాత్రి భోజనం అయ్యాక గిన్నెలో కొంచెం పప్పు మిగిలిపోతుంటది. దాన్ని ఫ్రిజ్ లో పెట్టి మరుసటి రోజు తినాలా? లేక పారేయాలా? అని ఆలోచిస్తుంటాం. చాలా సార్లు అది పాడైపోతుందేమోనని లేదా చల్లబడిన పప్పు రుచిగా ఉండదని పారేయడమే జరుగుతుంది. కానీ,ఆ మిగిలిపోయిన పప్పుతో నిమిషాల్లో ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?
మిగిలిపోయిన పప్పుతో సూపర్ టేస్టీ పరాఠా చేసుకోవచ్చు. ఇది కేవలం ఆహారాన్ని వృథా చేయకుండా ఉండటమే కాదు, అద్భుతమైన రుచిని కూడా ఇస్తుంది. మామూలు చపాతీలు తిని బోర్ కొట్టిన వారికి ఇదొక కొత్త రుచిని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు పప్పు తినడానికి మారం చేస్తుంటే, ఇలా పరాఠా చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు. ఒక్కసారి ఈ దాల్ పరాఠా రుచి చూస్తే, మీరు బంగాళాదుంప పరాఠాలను కూడా మర్చిపోతారు. మిగిలిపోయిన పప్పుతో సూపర్ టేస్టీ పరాఠా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మిగిలిపోయిన పప్పు(ఏ పప్పు అయినా): 1 కప్పు
గోధుమ పిండి: ఒకటిన్నర కప్పు
జీలకర్ర: అర టీస్పూన్
వాము: అర టీస్పూన్
కారం పొడి: అర టీస్పూన్
ధనియాల పొడి: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: కొద్దిగా
నెయ్యి లేదా నూనె: కాల్చడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండిని వేయండి. ఇప్పుడు ఈ పిండిలో జీలకర్ర, వాము, కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలపండి. మీరు కావాలనుకుంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా ఈ దశలో కలుపుకోవచ్చు.
-ఇప్పుడు పిండిలో నీళ్లు పోయడానికి బదులుగా, మీ దగ్గర ఉన్న మిగిలిపోయిన పప్పును కొద్దికొద్దిగా వేస్తూ పిండిని కలపడం ప్రారంభించండి. పప్పులో ఉండే తేమ పిండి కలపడానికి సరిపోతుంది. ఒకవేళ పప్పు మరీ గట్టిగా ఉంటే తప్ప, అదనంగా నీళ్లు పోయాల్సిన అవసరం రాదు. పిండి..చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి.
-పిండిని బాగా మర్దన చేస్తూ కలిపిన తర్వాత దానిపై మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
-తర్వాత నానిన పిండిని తీసుకుని, సమాన పరిమాణంలో ఉండలుగా చేసుకోండి. ఒక్కో ఉండను తీసుకుని పొడి పిండి అద్దుకుంటూ గుండ్రని పరాఠాల్లా ఒత్తుకోండి. ఇవి కొంచెం మందంగా ఉంటే రుచి బాగుంటుంది.
-స్టవ్ మీద పాన్ పెట్టి వేడి వేడెక్కాక ఒత్తుకున్న పరాఠాను వేయండి. ఒక వైపు కొద్దిగా కాలిన తర్వాత తిరగేసి స్పూన్ తో నూనె లేదా నెయ్యిని అంచుల వెంబడి వేయండి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోండి.
-వేడి వేడి దాల్ పరాఠాలను ప్లేట్లోకి తీసుకుని, దానిపై ఒక వెన్న ముద్ద వేసి వడ్డించండి. కమ్మని పెరుగు, నిమ్మకాయ ఊరగాయ లేదా పుదీనా చట్నీతో తింటే అమృతంలా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications