Latest Updates
-
కేవలం 20 నిమిషాల్లో కమ్మని వంకాయ రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
మగాళ్లను చంపి ఎలా తప్పించుకోవాలి..? మెట్రోలో మహిళ చేసిన షాకింగ్ పని.. వైరల్ వీడియో.! -
బ్లాక్ క్యాట్ గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి?..మీ పార్టనర్ కు ఈ లక్షణాలు ఉన్నాయా? -
బాత్రూమ్లో దుర్వాసన.. సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ఇంట్లోనే 5 నిమిషాల్లో రెడీ.! -
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.! -
కండరాల బలానికి, రోజంతా ఎనర్జీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..10 నిమిషాల్లో ఎగ్ అవకాడో ఖాఖ్రా చాట్ చేయండిలా.. -
మీ స్నేహితుల్లో ఈ 4 లక్షణాలు ఉంటే వెంటనే దూరం పెట్టండి! -
ఆకలి తీరాలి, బరువు పెరగకూడదు..అయితే డిన్నర్ కి ఇది బెస్ట్ చాయిస్..10 నిమిషాల్లోనే చేసేయండిలా! -
బానిసత్వం పోయింది బాస్: సిక్ లీవ్ అడిగిన ఉద్యోగి..మేనేజర్ ప్రశ్నకు జెన్ జీ ఉద్యోగి దిమ్మతిరిగే కౌంటర్ -
పప్పులు నానబెట్టే పనే లేదు.. అప్పటికప్పుడు అచ్చం పునుగుల్లా ఉండే మినీ రైస్ బోండా చేసుకోండిలా..
ఇడ్లీ, వడలు పక్కన పెట్టండి..మహారాష్ట్ర స్పెషల్ ఖప్రోలి ట్రై చేయండి..దూదిలా మెత్తగా..
రోజూ తినే ఇడ్లీ, దోశ, వడలు కాకుండా కొత్తగా ఏదైనా రుచి చూడాలని ఆహార ప్రియులు ఎప్పుడూ కోరుకుంటారు. అలాంటి వారికి ఒక అద్భుతమైన, నోరూరించే ప్రత్యామ్నాయం ఖప్రోలి. ఇది మహారాష్ట్ర సంప్రదాయ వంటకం. చూడటానికి అచ్చం మన దోశలాగే అనిపించినా, రుచిలోనూ, మృదుత్వంలోనూ దీని శైలి వేరు.
సాధారణ దోశలు కరకరలాడుతూ ఉంటే ఖప్రోలి మాత్రం మెత్తగా, స్పాంజ్ లాగా ఉంటుంది. దీనిని తీపి కొబ్బరి పాలతో గానీ లేదా కారంగా ఉండే చట్నీలతో గానీ తింటే ఆ రుచే వేరు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ వంటకం తయారీ చాలా సులభం. నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువైన ఈ ఖప్రోలిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
మినపప్పు - అర కప్పు
శనగపప్పు - పావు కప్పు
అటుకులు- అర కప్పు
మెంతులు - 1 టీ స్పూన్
పసుపు - చిటికెడు
నూనె లేదా వెన్న - కాల్చడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మరొక గిన్నెలో మినపప్పు, శనగపప్పు మరియు మెంతులను తీసుకుని బాగా కడిగి వాటిని కూడా నీటిలో నానబెట్టాలి. ఈ మిశ్రమాలన్నింటినీ కనీసం 6 గంటల పాటు నానబెట్టడం ముఖ్యం.
-పప్పులు బాగా నానిన తర్వాత, గ్రైండ్ చేయడానికి కేవలం 10 నిమిషాల ముందు అటుకులను నీటిలో నానబెట్టండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో నానబెట్టిన బియ్యం, పప్పు మిశ్రమం, అటుకులు అన్నీ కలిపి గ్రైండర్ లేదా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు జతచేయండి కానీ పిండి మరీ పల్చగా కాకుండా చూసుకోండి.
-రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. చేత్తో పిండిని బాగా కలపండి. చేత్తో కలపడం వల్ల పిండి త్వరగా పులియడానికి సహాయపడుతుంది.
-ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి, రాత్రంతా లేదా సుమారు 8 గంటల పాటు పిండిని పులియబెట్టాలి.
-మరుసటి రోజు ఉదయానికి పిండి బాగా పొంగి ఉంటుంది. గరిటతో ఒకసారి నెమ్మదిగా కలపండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడి చేయండి.
-పెనం వేడయ్యాక కొద్దిగా నూనె రాసి, గరిటెడు పిండిని వేసి దోశలా నెమ్మదిగా పరచండి. అయితే దీనిని మామూలు దోశలా మరీ పల్చగా కాకుండా, కాస్త మందంగా ఊతప్పంలా వేసుకోవాలి. చుట్టూ కొద్దిగా నూనె లేదా వెన్న వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి.వేడి వేడి మృదువైన ఖప్రోలి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications