Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
గోదారోళ్ల స్టైల్ లో వంజరం చేపల కర్రీ..నోటికి స్వర్గమే!
మర్యాద అంటే గోదారోళ్లు, రుచి అన్నా గోదారోళ్లేనండి. గోదారోళ్ల స్టైల్ లో చేపల పులుసు అంటే.. ఆ మాట వింటేనే చాలామందికి నోట్లో నీళ్లూరిపోతాయి. అందులోనూ చేపల్లో రారాజు, ఒక్క ముల్లు కూడా అడ్డురాని వంజరం చేపతో కర్రీ అంటే టేస్ట్ అదిరిపోతుంది.
వంజరం చేపకి ఉండే ప్రత్యేకత ఏంటంటే.. దీనికి ఎక్కువ ముళ్ళు ఉండవు. మధ్యలో ఒకే ఒక వెముక ఉంటుంది. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ భయం లేకుండా లాగించేయొచ్చు. గోదారోళ్ల స్టైల్ లో వంజరం చేపల కూర ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
వంజరం చేప ముక్కలు
నువ్వుల నూనె
ఉప్పు
కారం
పసుపు
పచ్చిమిరపకాయలు
కొత్తిమీర
కరివేపాకు
అల్లంవెల్లుల్లి పేస్ట్
రాళ్ల ఉప్పు
టమాటోలు
ధనియాల పొడి
వెల్లుల్లి రెబ్బలలు
ఉల్లిపాయ తరుగు
చింతపండు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన వంజరం ముక్కలు వేసి, ఇందులో కొద్దిగా పసుపు , కారం, ఉప్పు వేసి మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నువ్వుల నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడయ్యాక ఇందులో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి.
-ఆవాలు,మెంతులు వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాక ఇందులోనే తరిగిన టమాటోలు, రాళ్ల ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి టమాటోలు మగ్గి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి.
-ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో అందులో చిక్కటి చింతపండు గుజ్జు నీళ్లు పోసి 5 నిమిషాలు చింతపండు పచ్చి వాసన పోయేదాకా మరగనివ్వాలి.
-తర్వాత పక్కన ఉంచుకున్న ఉప్పు,పసుపు, కారం కలిపిన చేప ముక్కలను నెమ్మదిగా బాండీలో వేయాలి. గరిట పెట్టకుండా చేతులతో బాండీని పట్టకొని తిప్పి మూతపెట్టి చిన్న మంటపై 10 నిమిషాలు ముక్కల్ని ఉడికి నూనె పైకి తేలేంతవరకు ఉడకనివ్వాలి.
-ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆపేయండి. అంతే సూపర్ టేస్టీ వంజరం చేపల కర్రీ రెడీ.
కొన్ని ప్రయోజనాలు
వంజరం చేప మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వంజరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బీపీని కంట్రోల్ లో ఉంచడంలో ఇది బాగా పనిచేస్తుంది.
వంజరంలో ఉండే విటమిన్ A, ఒమేగా-3 కంటి చూపుని మెరుగుపరుస్తాయి. వంజరంలోని పోషకాలు మెదడు కణాలను యాక్టివ్ గా ఉంచుతాయి. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రత కుదరడానికి ఇది దోహదపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది. ఇందులో విటమిన్ D, కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications