Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
గోదారోళ్ల స్టైల్ లో వంజరం చేపల కర్రీ..నోటికి స్వర్గమే!
మర్యాద అంటే గోదారోళ్లు, రుచి అన్నా గోదారోళ్లేనండి. గోదారోళ్ల స్టైల్ లో చేపల పులుసు అంటే.. ఆ మాట వింటేనే చాలామందికి నోట్లో నీళ్లూరిపోతాయి. అందులోనూ చేపల్లో రారాజు, ఒక్క ముల్లు కూడా అడ్డురాని వంజరం చేపతో కర్రీ అంటే టేస్ట్ అదిరిపోతుంది.
వంజరం చేపకి ఉండే ప్రత్యేకత ఏంటంటే.. దీనికి ఎక్కువ ముళ్ళు ఉండవు. మధ్యలో ఒకే ఒక వెముక ఉంటుంది. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ భయం లేకుండా లాగించేయొచ్చు. గోదారోళ్ల స్టైల్ లో వంజరం చేపల కూర ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
వంజరం చేప ముక్కలు
నువ్వుల నూనె
ఉప్పు
కారం
పసుపు
పచ్చిమిరపకాయలు
కొత్తిమీర
కరివేపాకు
అల్లంవెల్లుల్లి పేస్ట్
రాళ్ల ఉప్పు
టమాటోలు
ధనియాల పొడి
వెల్లుల్లి రెబ్బలలు
ఉల్లిపాయ తరుగు
చింతపండు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన వంజరం ముక్కలు వేసి, ఇందులో కొద్దిగా పసుపు , కారం, ఉప్పు వేసి మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నువ్వుల నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడయ్యాక ఇందులో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి.
-ఆవాలు,మెంతులు వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాక ఇందులోనే తరిగిన టమాటోలు, రాళ్ల ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి టమాటోలు మగ్గి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి.
-ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో అందులో చిక్కటి చింతపండు గుజ్జు నీళ్లు పోసి 5 నిమిషాలు చింతపండు పచ్చి వాసన పోయేదాకా మరగనివ్వాలి.
-తర్వాత పక్కన ఉంచుకున్న ఉప్పు,పసుపు, కారం కలిపిన చేప ముక్కలను నెమ్మదిగా బాండీలో వేయాలి. గరిట పెట్టకుండా చేతులతో బాండీని పట్టకొని తిప్పి మూతపెట్టి చిన్న మంటపై 10 నిమిషాలు ముక్కల్ని ఉడికి నూనె పైకి తేలేంతవరకు ఉడకనివ్వాలి.
-ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆపేయండి. అంతే సూపర్ టేస్టీ వంజరం చేపల కర్రీ రెడీ.
కొన్ని ప్రయోజనాలు
వంజరం చేప మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వంజరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బీపీని కంట్రోల్ లో ఉంచడంలో ఇది బాగా పనిచేస్తుంది.
వంజరంలో ఉండే విటమిన్ A, ఒమేగా-3 కంటి చూపుని మెరుగుపరుస్తాయి. వంజరంలోని పోషకాలు మెదడు కణాలను యాక్టివ్ గా ఉంచుతాయి. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రత కుదరడానికి ఇది దోహదపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది. ఇందులో విటమిన్ D, కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









