Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్తో చపాతీ కంటే సాఫ్ట్గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
హోటల్ స్టైల్ లో క్రిస్పీ పాలక్ దోస..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి
దక్షిణ భారతదేశంలో ఉదయం లేవగానే గుర్తుకొచ్చే బ్రేక్ ఫాస్ట్ లలో దోస మొదటి వరుసలో ఉంటుంది. వేడివేడి పెనం మీద కాలుతున్న దోస వాసన చాలు ఆకలి పుట్టించడానికి. కానీ రోజూ ఆ సాదా దోసెలు లేదా మసాలా దోసెలు తిని మీకు విసుగు పుట్టిందా? మీ నాలుక కొత్త రుచిని కోరుకుంటోందా? అయితే పాలక్ దోస ట్రై చేయాల్సిందే.
కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యంలోనూ దీనికి తిరుగులేదు. పాలకూరలోని పోషకాలు, దోసెలోని క్రిస్పీనెస్ కలిసి దీనిని ఒక సూపర్ బ్రేక్ ఫాస్ట్ గా మారుస్తాయి. చాలామంది పిల్లలు ఆకుకూరలు తినడానికి మారాం చేస్తారు. పెద్దవాళ్లు కూడా కొన్నిసార్లు పాలకూర వంటకాలను ఇష్టపడరు. అలాంటి వారికి పాలకూరను తినిపించడానికి ఈ దోస ఒక అద్భుతమైన మార్గం. హెల్తీ,క్రిస్పీ పాలక్ దోస ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం (దోస బియ్యం) - 2 కప్పులు
మినపప్పు - అర కప్పు
పాలకూర - ఒక పెద్ద కట్ట
పచ్చిమిర్చి - 4
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - దోసెలు కాల్చడానికి
తయారీ విధానం
-ముందుగా బియ్యం, మినపప్పును శుభ్రంగా కడిగి, వేర్వేరుగా లేదా కలిపి కనీసం 5 నుండి 6 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
-పాలకూరను శుభ్రంగా కడిగి పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో పాలకూర ఆకులు, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే చాలా తక్కువ నీరు వాడండి. ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టిన బియ్యం,నానబెట్టిన మినపప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తని దోసె పిండిలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-దోసెలు క్రిస్పీగా రావాలంటే పిండి పులియడం ముఖ్యం. ఈ మిశ్రమాన్ని కనీసం 6 నుండి 8 గంటలు లేదా రాత్రంతా మూత పెట్టి పక్కన ఉంచండి. పిండి పులిసినప్పుడు దోసెలు రంధ్రాలతో, మంచి రుచితో వస్తాయి.
-స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ లేదా దోసె పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడెక్కాక గరిటెడు పిండిని తీసుకుని పెనం మధ్యలో వేసి వృత్తాకారంలో పల్చగా విస్తరించండి.
-దోసె చుట్టూ కొంచెం నూనె లేదా నెయ్యి వేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి దోసెను ఎర్రగా, క్రిస్పీగా కాల్చండి. అడుగు భాగం బంగారు గోధుమ రంగులోకి రాగానే దోసెను మడిచి ప్లేట్ లోకి తీసుకోండి.
-వేడి వేడి పాలక్ దోసెను కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచే వేరు. కాస్త పుల్లగా, కారంగా కావాలనుకుంటే టమాటా చట్నీ లేదా అల్లం చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. హోటల్ స్టైల్ ఫీల్ కావాలంటే వేడి సాంబార్ తో కలిపి ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications