Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
చుక్క నూనె లేకుండానే కిచిడి..నోట్లో పెట్టుకుంటే అమృతమే..ఎలా చేసుకోవాలంటే
ఈరోజుల్లో చాలామంది ఆరోగ్యంపట్ల శ్రద్ధ పెంచుకుంటున్నారు. తక్కువ నూనె, తక్కువ మసాలాతో తయారుచేసే వంటకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చుక్క నూనె లేదా నెయ్యి లేకుండా చేసే వంటకాలను తినేందుకు మరీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నూనె, నెయ్యి లేకుండా తయారుచేసుకోగల టేస్టీ వంటకాల్లో కిచిడి ఒకటి. ఈ రెసిపీని తయారుచేయడానికి ఎక్కువ సమయం పట్టదు. చాలా తక్కువ పదార్థాలతోనే మంచి రుచిని పొందవచ్చు. చుక్క నూనె, నెయ్యి లేకుండానే కిచిడి ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-లవంగాలు
-యాలకలు
-స్టార్ అనాస
-బిర్యానీ ఆకు
-రాతి పువ్వు
-పచ్చిమిర్చి
-పెసరపప్పు
-నీళ్లు
-ఉప్పు
-మిరియాలు
-బీన్స్
-ఎండుకొబ్బరి తురుము
-క్యారెట్
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-జీడిపప్పు
-కొత్తిమీర
-కరివేపాకు

తయారీ విధానం
-చుక్క ఆయిల్ లేకుండా టేస్టీ కిచిడి..నోట్లో పెట్టుకుంటే అమృతమే..ఎలా చేసుకోవాలంటే..
-ముందుగా ఓ పెద్ద బౌల్ తీసుకొని అందులో 1 గ్లాసు బియ్యం(250 గ్రాములు), అర గ్లాసు పెసరపప్పు(125గ్రా) వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగాలి.
-కడిగిన బియ్యం,పెసరపప్పు మిశ్రమంలో మళ్లీ నీళ్లు పోసి 15 నిమిషాలు నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 2 యాలకలు, 2 బిర్యానీ ఆకులు, 5 లవంగ మొగ్గలు, కొద్దిగా దాల్చిన చెక్క, 10 మిరియాలు, రాతిపువ్వు కొంచెం, 1 స్టార్ అనాస వేసి తక్కువ మంట మీద 1 నిమిషం పాటు వేయించుకోవాలి.
-తర్వాత అందులో సన్నగా,పొడవుగా కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలు,2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి వేయించుకోవాలి.
-ఉల్లిపాయ ముక్కలు దోరగా మగ్గిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 బంగాళదుంప ముక్కలు, 7 బీన్స్ ముక్కలు, పావు కప్పు క్యారెట్ ముక్కలు, 8 జీడిపప్పు పలుకులు, 6 పొడవుగా చీరిన పచ్చిమిరపకాయలు వేసి మీడియం మంట మీద 2-3 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి.
-ఉడికించేటప్పుడు ఏవీ మాడిపోకుండా ఉండేందుకు మధ్యమధ్యలో 2 టీస్పూన్ నీళ్లు వేసుకుంటా బాగా కలుపుతూ ఉడికించాలి.
-తర్వాత అందలో 3 టీస్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ ఫ్రై చేసుకోండి.
-తర్వాత అందులో నానబెట్టిన బియ్యం,పెసరపప్పును వేసి బాగా కలిపి 2-3 నిమిషాల పాటు అందులోని నీరు ఇగిరిపోయేదాకా మీడియం మంట మీద కలుపుతూ ఉడికించుకోవాలి.
-తర్వాత అందులో 3 గ్లాసుల నీళ్లు,రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసి బాగా కలిపి మూతపెట్టి పెద్ద మంట మీద 2 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. మూత తీసి చూస్తే వేడి వేడి కిచిడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications