Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Saggubiyyam Khichdi: ఉపవాసం స్పెషల్..ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేని రుచి,ఎలా చేయాలంటే..
సగ్గుబియ్యంతో పాయసమే కాదు కిచిడీ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా? ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు రుచి కూడా యమాగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంటది. ముఖ్యంగా ఉపవాస దీక్షలో ఉండేవాళ్లకు అనుకూలమైన అల్పాహారం ఇది. నార్త్ ఇండియాలో ఉపవాసాల సమయంలో తేలికగా తినే ఆహారాలలో సగ్గుబియ్యం కిచిడి ఒకటి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఈ అల్పాహారం బరువు తగ్గాలనుకునేవారికి కూడా బెస్ట్ గా ఉంటుంది. సగ్గుబియ్యం కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
సగ్గుబియ్యం కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-సగ్గుబియ్యం
-ఆయిల్
-వేరుశెనగ పప్పు
-నిమ్మ రసం
-చక్కెర
-నల్ల మిరియాల పొడి
-కొత్తిమీర
-పచ్చిమిర్చి పేస్ట్
-బంగాళ దుంప ముక్కలు
-కరివేపాకు
-ఉప్పు
సగ్గుబియ్యం తయారీ విధానం
-1 కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో అరకప్పు నీళ్లు పోసి 4 గంటల పాటు నాననివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి దాని మీద పావు కప్పు శెనగపప్పు వేసి ఎర్రగా వేయించి దాని పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. తర్వాత అందులోనే పొట్టు తీసి చిన్నగా కట్ చేసిన అరకప్పు బంగాళదుంప ముక్కలు, కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.
-కొంచెం మగ్గిన ఆలూలో 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి.
-ఆలూ మెత్తబడిన తర్వాత అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, 1 టీస్పూన్ చక్కెర వేసి రంగు తేలికపడే వరకు మూతపెట్టి మగ్గనివ్వండి.
-తర్వాత అందులో దంచుకున్న పల్లీలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












