Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
కరకరలాడే సగ్గుబియ్యం వడలు..తింటే అద్భుతం అంటారు,ఎలా చేసుకోవాలో చూడండి
వడల్లో అనేక రకాల వెరైటీలు ఉంటాయి. వీటిలో సగ్గుబియ్యం వడలు ఒకటి. ఇవి క్రిస్పీగా భలే రుచిగా ఉంటాయి. బ్రేక్ ఫాస్ట్ లేదా సాయంత్నం స్నాక్ లోకి ఎలా తీసుకున్నా అదిరిపోతుంది. ఒక్కటి తిని ఆగరు. ఇంకా కావాలి అని అడుగుతంటారు. అంత రుచికరంగా ఉంటాయి. క్రిస్పీగా ఉండే ఈ సగ్గుబియ్యం వడలు ఇంట్లోనే ఈజీగా తయారుచేసుకోవచ్చు. దీనికి పెద్ద ప్రాసెస్ కూడా ఉండదు. సగ్గుబియ్యం వడలు తయారుచేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
సగ్గుబియ్యం వడలు తయరీకి కావలసిన పదార్థాలు
-సగ్గుబియ్యం
-జీలకర్ర
-పచ్చిమిర్చి
-కొత్తిమీర
-ఉప్పు
-చక్కెర
-పల్లీలు
-బంగాళదుంప
-పుదీనా
-ఆయిల్

సగ్గుబియ్యం వడలు తయారీ విధానం
-ముందుగా పావు కేజీ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద ఓ పాన్ పెట్టి అందులో 1 కప్పు పల్లీలు వేసి ఆయిల్ లేకుండానే వేయించి పక్కనపెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు తీసేయాలి. ఇందులో నుంచి సగం కప్పు పల్లీలు తీసుకొని మిక్సీలో వేసి పలుకులు పలుకులుగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి.
-తర్వాత చట్నీ కోసం మిగిలిన అరకప్పు పొట్టు తీసిన పల్లీలు మిక్సీ గిన్నెలో వేసి,ఇందులోనే 1 కట్ట కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 4 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగి ఉప్పు, కొద్దిగా చక్కెర, కొద్దిగా నిమ్మరసం వేసి మధ్య మధ్యలో కొంచెం నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చెట్నీ రెడీ. దీన్ని పక్కనపెట్టుకోండి.
రాయలసీమ పల్లెల స్పెషల్ బెండకాయ బజ్జీ..టేస్ట్ లో తిరుగుండదు అంతే..ఎలా చేసుకోవాలంటే..
-ఇప్పుడు రెండు బంగాళదుంపలను ఉడికించుకోవాలి.
-తర్వాత నానిన సగ్గుబియ్యంలో కచ్చాపచ్చగా గ్రైండ్ చేసిన పల్లీలు, 1 టీస్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి, ఉడికించిన బంగాళదుంపల తురుము, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నీళ్లు అస్సలు వేయకూడదని గుర్తుంచుకోండి.
-తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని సగ్గుబియ్యం మిశ్రమాన్ని ముద్దలుగా చేతిలోకి తీసుకొని వడలుగా వత్తి వాటిని వేడి వేడిగా కాగే నూనెలో వేయించుకోవాలి. అంతే కరకరలాడే సగ్గుబియ్యం వడలు రెడీ. వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీతో నంజుకొని తింటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications