Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
బియ్యం,అటుకులు అక్కర్లేదు..శనగలు,బొబ్బర్లతో హై ప్రొటీన్ దోశ..రుచితో పాటే ఆరోగ్యం..ఎలా చేసుకోవాలంటే
ప్రతిరోజూ అవే ఇడ్లీలు, దోశలు తిని విసుగెత్తిపోయారా? ఉదయాన్నే ఆరోగ్యకరమైన, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే బ్రేక్ ఫాస్ట్ కోసం చూస్తున్నారా? అయితే ఒక్కసారి హై ప్రోటీన్ దోశ ట్రై చేయండి. కేవలం రుచిలోనే కాదు, పోషకాల విషయంలోనూ ఇది ఒక ఖజానా. పప్పుధాన్యాలు, శెనగలు, క్వినోవా వంటి సూపర్ ఫుడ్స్ కలయికతో తయారైన ఈ దోశ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. సాధారణంగా మనం బియ్యం, మినపప్పుతో దోశలు వేసుకుంటాం. కానీ ఈ దోశలో శనగలు, పెసలు, కందులు, బొబ్బర్లు, క్వినోవా వంటి ఎన్నో బలవర్థకమైన పదార్థాలను వాడుతున్నాం. ఈ హై ప్రొటీన్ దోశను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
హై ప్రొటీన్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
నల్ల శనగలు-1 కప్పు
తెల్ల శనగలు- 1 కప్పు
మినపప్పు- 1 కప్పు
పెసలు- 1కప్పు
ఎర్ర కందిపప్పు- 1కప్పు
బొబ్బర్లు(అలసందలు)-1 కప్పు
క్వినోవా-2 కప్పులు
సగ్గుబియ్యం- 2 టేబుల్ స్పూన్లు
మెంతులు- 2 టీస్పూన్లు

తయారీ విధానం
-హై ప్రొటీన్ దోశ తయారీకోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో నల్ల శనగలు, తెల్ల శెనగలు, మినపప్పు, పెసలు, అలసందలు, క్వినోవా, ఎర్రయ కందిపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి.
-ఇదే సమయంలో ఓ చిన్న బౌల్ లో సగ్గుబియ్యం కూడా వేసి నానబెట్టండి, ఇంకో బౌల్ లో మెంతులు వేసి నీళ్లు పోసి నానబెట్టండి
-రాత్రంతా నానబెట్టిన వీటన్నింటినీ ఉదయాన్నే నీటిని వంపేసి అన్నింటినీ కలిపి మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఈ పిండిని చేత్తో బాగా కలిపి వాతావరణాన్ని బట్టి 8-10 గంటల పాటు పులియబెట్టాలి. చేత్తో కలపడం వల్ల పిండి సహజంగా, చక్కగా పులిసి దోశలు మెత్తగా, రుచిగా వస్తాయి.
-దోశలు వేసుకునే ముందు కావలసినంత పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
-స్టవ్ మీద దోశ పెసం పెట్టి వేడిగా ఉన్న పెనంపై నూనె రాసి, పలుచగా దోశలు వేసుకుని, రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. అంతే పోషకాలతో నిండిన వేడివేడి దోశలు రెడీ. వీటిని పల్లీల చట్నీ లేదా ఘాటైన అల్లం చట్నీతో తింటుంటే ఆ రుచే అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications