Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
బియ్యం,అటుకులు అక్కర్లేదు..శనగలు,బొబ్బర్లతో హై ప్రొటీన్ దోశ..రుచితో పాటే ఆరోగ్యం..ఎలా చేసుకోవాలంటే
ప్రతిరోజూ అవే ఇడ్లీలు, దోశలు తిని విసుగెత్తిపోయారా? ఉదయాన్నే ఆరోగ్యకరమైన, రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచే బ్రేక్ ఫాస్ట్ కోసం చూస్తున్నారా? అయితే ఒక్కసారి హై ప్రోటీన్ దోశ ట్రై చేయండి. కేవలం రుచిలోనే కాదు, పోషకాల విషయంలోనూ ఇది ఒక ఖజానా. పప్పుధాన్యాలు, శెనగలు, క్వినోవా వంటి సూపర్ ఫుడ్స్ కలయికతో తయారైన ఈ దోశ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. సాధారణంగా మనం బియ్యం, మినపప్పుతో దోశలు వేసుకుంటాం. కానీ ఈ దోశలో శనగలు, పెసలు, కందులు, బొబ్బర్లు, క్వినోవా వంటి ఎన్నో బలవర్థకమైన పదార్థాలను వాడుతున్నాం. ఈ హై ప్రొటీన్ దోశను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
హై ప్రొటీన్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
నల్ల శనగలు-1 కప్పు
తెల్ల శనగలు- 1 కప్పు
మినపప్పు- 1 కప్పు
పెసలు- 1కప్పు
ఎర్ర కందిపప్పు- 1కప్పు
బొబ్బర్లు(అలసందలు)-1 కప్పు
క్వినోవా-2 కప్పులు
సగ్గుబియ్యం- 2 టేబుల్ స్పూన్లు
మెంతులు- 2 టీస్పూన్లు

తయారీ విధానం
-హై ప్రొటీన్ దోశ తయారీకోసం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో నల్ల శనగలు, తెల్ల శెనగలు, మినపప్పు, పెసలు, అలసందలు, క్వినోవా, ఎర్రయ కందిపప్పు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి.
-ఇదే సమయంలో ఓ చిన్న బౌల్ లో సగ్గుబియ్యం కూడా వేసి నానబెట్టండి, ఇంకో బౌల్ లో మెంతులు వేసి నీళ్లు పోసి నానబెట్టండి
-రాత్రంతా నానబెట్టిన వీటన్నింటినీ ఉదయాన్నే నీటిని వంపేసి అన్నింటినీ కలిపి మెత్తటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఈ పిండిని చేత్తో బాగా కలిపి వాతావరణాన్ని బట్టి 8-10 గంటల పాటు పులియబెట్టాలి. చేత్తో కలపడం వల్ల పిండి సహజంగా, చక్కగా పులిసి దోశలు మెత్తగా, రుచిగా వస్తాయి.
-దోశలు వేసుకునే ముందు కావలసినంత పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
-స్టవ్ మీద దోశ పెసం పెట్టి వేడిగా ఉన్న పెనంపై నూనె రాసి, పలుచగా దోశలు వేసుకుని, రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి. అంతే పోషకాలతో నిండిన వేడివేడి దోశలు రెడీ. వీటిని పల్లీల చట్నీ లేదా ఘాటైన అల్లం చట్నీతో తింటుంటే ఆ రుచే అమోఘం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications