Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
హోలీ స్పెషల్..తాగేకొద్దీ తాగాలనిపించే చల్లని థాండాయ్..ఎలా చేసుకోవాలంటే..
హోలీ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది రంగుల కోలాహలం,స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చేసే సందడి. అయితే ఈ పండుగ సంబరాలు కేవలం రంగులు, నీళ్ల ఆటలకే పరిమితం కాదు. నోరూరించే పిండివంటలు, ముఖ్యంగా చల్లని థాండాయ్ లేనిదే హోలీ పండుగ అసంపూర్ణమనే చెప్పాలి.
ఉదయం నుండి ఎండలో రంగులతో ఆడి అలిసిపోయిన శరీరానికి, ఎండిన గొంతుకు ఒక్క గ్లాసు చల్లని థాండాయ్ తగిలితే ఆ మజాయే వేరు. ఇది కేవలం దాహాన్ని తీర్చడమే కాదు, తక్షణ శక్తిని ఇచ్చి మిమ్మల్ని మళ్లీ ఉత్సాహంగా మార్చేస్తుంది. ఈ హోలీకి మీ అతిథులను ఆకట్టుకునేలా అద్భుతమైన థాండాయ్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
బాదంపప్పులు: 8-10
జీడిపప్పులు: 8-10
పిస్తాపప్పులు: 8-10
పుచ్చకాయ గింజలు: 1 టేబుల్ స్పూన్
గసగసాలు: 1 టేబుల్ స్పూన్
సోంపు: 1 టేబుల్ స్పూన్
ఆకుపచ్చ యాలకులు: 4-5
నల్ల మిరియాలు: 4-5
ఎండిన గులాబీ రేకులు: కొద్దిగా
కుంకుమపువ్వు: కొద్దిగా
చక్కెర: 2 టేబుల్ స్పూన్లు
చల్లని పాలు: 1 లీటరు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో బాదంపప్పులను వేసి సుమారు 10 నిమిషాల పాటు నానబెట్టండి. మరొక గిన్నెలో జీడిపప్పు, పిస్తాపప్పు, పుచ్చకాయ గింజలు, గసగసాలు, సోంపు వేసి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
-10 నిమిషాల తర్వాత బాదంపప్పుల తొక్కను సులభంగా తీసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, గింజలన్నీ వేయండి. దీనికి కొద్దిగా పాలు జతచేసి, చాలా మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి.
-యాలకులు, నల్ల మిరియాలు, ఎండిన గులాబీ రేకులను మిక్సీలో వేసి మెత్తని పొడిలా తయారు చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పాలు తీసుకుని అందులో కుంకుమపువ్వు వేసి పక్కన ఉంచండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పాలను పోసి బాగా మరిగించండి. పాలు మరుగుతున్నప్పుడు మీ రుచికి సరిపడా చక్కెర వేసి, అది పూర్తిగా కరిగేలా కలపండి.
-చక్కెర కరిగిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసుకున్న కుంకుమపువ్వు పాలను వేసి కలపాలి. ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ను పాలలో వేసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద 2-3 నిమిషాల పాటు ఉడికించాలి.
-ఇప్పుడు ముందుగా దంచి పెట్టుకున్న యాలకులు, మిరియాలు, గులాబీ రేకుల పొడిని పాలలో వేసి బాగా కలపాలి. మీకు మరింత రిచ్ టేస్ట్ కావాలంటే ఉడుకుతున్న పాలలో కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ లేదా ఫ్రెష్ క్రీమ్ కలుపుకోవచ్చు.
-స్టవ్ ఆఫ్ చేసి మంచి సువాసన కోసం ఒక చెంచా రోజ్ వాటర్ కలపండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిచ్చి, ఫ్రిజ్ లో పెట్టి బాగా కూల్ చేయాలి.
-సర్వ్ చేసే ముందు గ్లాసుల్లో పోసి పైన సన్నగా తరిగిన పిస్తా, బాదం పలుకులతో గార్నిష్ చేసి ఇస్తే తాగేకొద్దీ తాగాలనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications