Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
వెల్లుల్లి పులుసు తింటే సర్వ రోగాలు మటుమాయం,సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసా?
ఇప్పుడైతే అన్నంలో కూడా టమాటో సాస్ వేసుకొని తినేస్తున్నారు. దీంతోపాటు రకరకాల ఫ్యాన్సీ, ఫ్యాన్సీ వంటలు చేసుకొని తింటున్నారు. దీని కారణంగా అనారోగ్యం పాలవడంతో పాటు శరీరానికి ఎలాంటి పోషకాలు అందడం లేదు. కానీ మన పూర్వికులు చాలా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకునే వారు. అందులో ఒకటే వెల్లుల్లి పులుసు. దీనిని చింతపండు పులుసు మాదిరిగానే చేసుకుంటారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వెల్లుల్లి పులుసును ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో వివరించాము. పూర్తిగా చదివి మీరు కూడా ట్రై చేయండి.
వెల్లుల్లి పులుసు తయారీకి కావలసిన పదార్థాలు:
చింతపండు - 50 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు - 10-15
ఉల్లిపాయ - 1 (చిన్నది)
పచ్చిమిర్చి - 2-3 (మీ రుచికి తగినట్లు)
కరివేపాకు - 2 రెబ్బలు
ఆవాలు - 1/2 టీస్పూన్
మెంతులు - 1/4 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
పసుపు - 1/2 టీస్పూన్
కారం పొడి - 1 టీస్పూన్ (మీ రుచికి తగినట్లు)
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేయించడానికి సరిపడా

వెల్లుల్లి పులుసు తయారీ విధానం:
- ముందుగా చింతపండును వేడి నీటిలో నానబెట్టి, గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక పాన్లో నూనె వేసి, ఆవాలు, మెంతులు మరియు ఇంగువ వేయాలి వేసుకొని వేయించుకోవాలి.
- తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
- ఆ తరువాత ఆ మిశ్రమంలో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి.
- ఇప్పుడు చింతపండు పులుసు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి మరియు ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం పులుసును కాసేపు ఉడకనివ్వాలి, అది చిక్కబడే వరకు అలానే ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి దించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, మన పూర్వీకుల స్టైల్లో వెల్లుల్లి పులుసు సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications