Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
మన పూర్వీకులు తిన్న ఆరోగ్యకరమైన స్వీట్ ఇదే..అందుకే అంత ఎనర్జీ,ఎలా చేసుకోవాలంటే..
ఇప్పుడంటే వందల రకాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి కానీ పూర్వకాలంలో కొన్ని రకాల స్వీట్లు మాత్రమే తరుచుగా తింటుండేవాళ్లు. అది కూడా ఆరోగ్యకరమైన స్వీట్లు తినేవాళ్లు కాబట్టే వాళ్లకి రోగాలు కూడా తక్కువ ఉండేవి. కొండలు అయినా పిండి చేసేటంతటి బలం ఉండేది. అలాంటి ఆరోగ్యకరమైన పాతకాలం నాటి సంప్రదాయ స్వీట్ లలో తిమ్మనం ఒకటి. ఇది తింటుంటే ఎంత తిన్నాం అని కూడా ఆలోచించరు. నోట్లో ఐస్ క్రీమ్ లా కరిగిపోయే పాలకాలంనాటి ఆరోగ్యకరమైన తిమ్మనం స్వీట్ ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
తిమ్మనం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పచ్చి కొబ్బరి
-బెల్లం
-యాలకల పొడి
-జీడిపప్పు
-బాదంపపప్పు
-పాలు
-నెయ్యి
-ఎండుద్రాక్ష
తిమ్మనం తయారీ విధానం
-అరకప్పు అన్నం వండుకునే బియ్యాన్ని కడిగి గంట సేపు నానబెట్టండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో గంటసేపు నానిన బియ్యం, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అక కప్పు నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా, మరీ రవ్వలా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి రెండున్నర కప్పుల పాలను మరిగించాలి.
-పాలు మరగడం మొదలైన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న బియ్యం పేస్ట్ వేసి మంటను లో ప్లేమ్ లో ఉంచి 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.
-బాగా ఉడికి దగ్గరపడి క్రీమ్ లా అయిన తర్వాత దించేసి పక్కనపెట్టుకోండి
-ఇప్పుడు స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అరకప్పు బెల్లం, అరకప్పు నీళ్లు పోసి బెల్లం కరిగిన తర్వాత అరస్పూన్ యాలకల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-ముందుగా ఉడికించి పక్కనపెట్టుకున్న పాలు బియ్యం మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బెల్లం పాకం అందులో పోసి కలపండి. ఇందులోనే నెయ్యిలో వేయించిన జీడిపప్పు,ఎండుద్రాక్ష,బాదం పలుకులు వేసి కలపండి. అంతే టేస్టీ,హెల్తీ తిమ్మనం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






