Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మన పూర్వీకులు తిన్న ఆరోగ్యకరమైన స్వీట్ ఇదే..అందుకే అంత ఎనర్జీ,ఎలా చేసుకోవాలంటే..
ఇప్పుడంటే వందల రకాల స్వీట్లు అందుబాటులో ఉన్నాయి కానీ పూర్వకాలంలో కొన్ని రకాల స్వీట్లు మాత్రమే తరుచుగా తింటుండేవాళ్లు. అది కూడా ఆరోగ్యకరమైన స్వీట్లు తినేవాళ్లు కాబట్టే వాళ్లకి రోగాలు కూడా తక్కువ ఉండేవి. కొండలు అయినా పిండి చేసేటంతటి బలం ఉండేది. అలాంటి ఆరోగ్యకరమైన పాతకాలం నాటి సంప్రదాయ స్వీట్ లలో తిమ్మనం ఒకటి. ఇది తింటుంటే ఎంత తిన్నాం అని కూడా ఆలోచించరు. నోట్లో ఐస్ క్రీమ్ లా కరిగిపోయే పాలకాలంనాటి ఆరోగ్యకరమైన తిమ్మనం స్వీట్ ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
తిమ్మనం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పచ్చి కొబ్బరి
-బెల్లం
-యాలకల పొడి
-జీడిపప్పు
-బాదంపపప్పు
-పాలు
-నెయ్యి
-ఎండుద్రాక్ష
తిమ్మనం తయారీ విధానం
-అరకప్పు అన్నం వండుకునే బియ్యాన్ని కడిగి గంట సేపు నానబెట్టండి.
-తర్వాత మిక్సీ గిన్నెలో గంటసేపు నానిన బియ్యం, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, అక కప్పు నీళ్లు పోసి మరీ మెత్తగా కాకుండా, మరీ రవ్వలా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి రెండున్నర కప్పుల పాలను మరిగించాలి.
-పాలు మరగడం మొదలైన తర్వాత అందులో గ్రైండ్ చేసుకున్న బియ్యం పేస్ట్ వేసి మంటను లో ప్లేమ్ లో ఉంచి 10 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి.
-బాగా ఉడికి దగ్గరపడి క్రీమ్ లా అయిన తర్వాత దించేసి పక్కనపెట్టుకోండి
-ఇప్పుడు స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో అరకప్పు బెల్లం, అరకప్పు నీళ్లు పోసి బెల్లం కరిగిన తర్వాత అరస్పూన్ యాలకల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి.
-ముందుగా ఉడికించి పక్కనపెట్టుకున్న పాలు బియ్యం మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బెల్లం పాకం అందులో పోసి కలపండి. ఇందులోనే నెయ్యిలో వేయించిన జీడిపప్పు,ఎండుద్రాక్ష,బాదం పలుకులు వేసి కలపండి. అంతే టేస్టీ,హెల్తీ తిమ్మనం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







