మన పూర్వికులు చేసుకునే ఎండు రొయ్యల కారంపొడి,వేడి వేడి అన్నంలో తింటే అబ్బా!.. ఎలా చేసుకోవాలంటే?

చాలా మందికి రొయ్యలు అంటే ఇష్టం ఉంటుంది. రొయ్యలతో చేసుకునే వంటలు ఏవైనా చాలా అద్భుతంగా ఉంటుంది. రొయ్య వేపుడు, రొయ్యల పులుసు, రొయ్యల కూర తినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి రొయ్య తింటే ఆ రుచి మళ్ళీ జన్మలో మర్చిపోరు. అంతటి రుచి ఉన్న ఆ రొయ్యలతో కారం పొడి చేసుకుంటారు. దీనిని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు. అయితే ఈ ఎండు రొయ్యలతో కారంపొడి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఎండు రొయ్యల కారంపొడి తయారీకి పదార్థాలు:

ఎండు రొయ్యలు - 1 కప్పు
ఎండు మిరపకాయలు - 10-15 (మీ రుచికి తగినట్లు)
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 5-6
చింతపండు - చిన్న ముక్క
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేయించడానికి సరిపడా

How to make dry prawn chilli powder at home in telugu

తయారీ విధానం:

ముందుగా ఎండు రొయ్యలను శుభ్రంగా కడిగి, నీరు లేకుండా ఆరబెట్టాలి.
ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి, ఎండు రొయ్యలను దోరగా వేయించుకోవాలి.
ఇప్పుడు అదే పాన్‌లో ధనియాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలను కూడా వేయించుకోవాలి.
వేయించుకున్న పదార్థాలన్నిటిని చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత, మిక్సీ జార్‌లో వేయించుకున్న పదార్థాలు, చింతపండు, ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
అవసరమైతే కొద్దిగా నీరు చేర్చి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవచ్చు.
ఈ కారంపొడిని వేడి వేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Monday, February 3, 2025, 9:10 [IST]
Desktop Bottom Promotion