Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కంటికి ఇంపుగా..నోటికి రుచిగా..ఆరోగ్యాన్నిచ్చే రెయిన్ బో పూరీలు ఎలా చేసుకోవాలంటే..
వేడి వేడి నూనెలో వేయించిన బంగారు రంగు పూరీలను చూస్తుంటే ఎవరికైనా నోరూరాల్సిందే. అయితే, ఎప్పుడూ ఒకే రంగులో ఉండే పూరీలను చూసి మీకు లేదా మీ పిల్లలకు బోర్ కొట్టిందా? అయితే కంటికి ఇంపుగా, నోటికి రుచిగా ఉండే రెయిన్ బో పూరీలను ట్రై చేయండి.
ఈ పూరీలు చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇందులో వాడే రంగులన్నీ కృత్రిమమైనవి కావు. పూర్తిగా ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు, పండ్ల నుండి తీసినవి. కూరగాయలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఈ రంగుల పూరీలను పెడితే బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే. రెయిన్ బో పూరీలు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
గోధుమ పిండి: 2 కప్పులు
నూనె: పిండి కలపడానికి, డీప్ ఫ్రై చేయడానికి
ఉప్పు: రుచికి తగినంత
సహజ రంగుల కోసం:
ఆకుపచ్చ రంగు: పాలకూర లేదా కొత్తిమీర ఉడికించి పేస్ట్ చేసుకోవాలి
ఎరుపు/మెరూన్ రంగు: బీట్ రూట్ రసం
పసుపు రంగు: చిటికెడు పసుపు
నారింజ రంగు: టమోటా, క్యారెట్ కలిపిన మిశ్రమం
గులాబీ రంగు: దానిమ్మ, బీట్ రూట్ రసం మిశ్రమం
తయారీ విధానం
-ముందుగా మనం ఎంచుకున్న కూరగాయలు లేదా పండ్ల నుండి రసాలను లేదా మెత్తటి పేస్ట్ ను సిద్ధం చేసుకోవాలి. ఈ రసాలు మరీ పల్చగా ఉండకూడదు. పిండిలో కలిపినప్పుడు ఎక్కువ నీరు అవసరం లేకుండా చిక్కగా ఉంటే పూరీలు బాగా పొంగుతాయి.
-ఇప్పుడు గోధుమ పిండిలో తగినంత ఉప్పు, ఒక చెంచా నూనె వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ పిండిని 5 లేదా 6 సమాన భాగాలుగా విభజించి వేర్వేరు గిన్నెలలో పెట్టుకోవాలి.
-ఇప్పుడు ఒక్కో గిన్నెలోని పిండిలో సిద్ధం చేసుకున్న ఒక్కో రంగు రసాన్ని వేసి కలపాలి. ఒక భాగంలో పాలకూర పేస్ట్, మరొక భాగంలో బీట్ రూట్ రసం.. ఇలా అన్నీ కలపాలి. అవసరమైతేనే కొద్దిగా నీరు వాడాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, మరీ మెత్తగా కాకుండా మృదువుగా ఉండేలా చూసుకోవాలి.
-రంగురంగులుగా సిద్ధం చేసుకున్న పిండి ముద్దలపై తడి గుడ్డ కప్పి లేదా మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.
-ఇప్పుడు ప్రతి రంగు పిండి నుండి చిన్న చిన్న ఉండలు తీసుకోండి.
-రెండు లేదా మూడు వేర్వేరు రంగుల చిన్న పిండి ముద్దలను కలిపి ఒకే ఉండలా చేసి, దానిని పూరీలా ఒత్తండి. అప్పుడు ఒకే పూరీలో రెండు మూడు రంగులు కలిసి ఇంద్రధనస్సులా అద్భుతంగా కనిపిస్తాయి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేడి చేశాక మంటను మీడియంలో పెట్టి ఒక్కో పూరీని వేసి వేయించాలి. రెండు వైపులా చక్కగా కాలాక తీసి టిష్యూ పేపర్ పై వేయాలి.
-వేడి వేడి రంగురంగుల రెయిన్ బో పూరీలను బంగాళాదుంప కుర్మాతో గానీ, ఘాటైన చోలే మసాలాతో వడ్డిస్తే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications