చుక్క ఆయిల్ అక్కర్లేదు..ఈ మంగళూరు రెసిపి జీవితంలో ఒక్కసారైనా తిని తీరాల్సిందే

Posted By:

కరోనా తర్వాత నుంచి అందరిలోనూ ఆరోగ్యం పట్ల శ్రద్ద విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆయిల్ ఫుడ్ ని తగ్గించి ఆరోగ్యంగా ఉండే ఫుడ్ వైపు చాలామంది మెగ్గుచూపుతున్నారు. సాక్షాత్తూ మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఆయిల్ వాడకం తగ్గించాలని పిలుపునిచ్చారు. అయితే చుక్క ఆయిల్ లేకుండా చేసే రెసిపిలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిల్లో నీరు దోశ ఒకటి.

మంగళూరులో నీరు దోసె చాలా ఫేమస్. కర్ణాటకలో ఏ మూలకు వెళ్లిన అక్కడి రెస్టారెంట్లలో మంగళూరు స్పెషల్ నీర్ దోశ దొరుకుతుంది. దీనిని మీ ఇంట్లో కూడా ఫర్ఫెక్ట్ గా చేసుకోవాలంటే కొన్ని టిప్ప్ పాటించాలి. మంగళూరు స్పెషల్ నీరు దొశ తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

నీరు దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు

-ఇడ్లీ బియ్యం లేదా రేషన్ బియ్యం
-పచ్చి కొబ్బరి
-ఉప్పు

నీరు దోశ తయారీ విధానం

-ముందుగా 1 కప్పు ఇడ్లీ బియ్యం లేదా రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లలో వేసి కనీసం 6 గంటలు నానబెట్టండి.

-తర్వాత నానిన బియ్యాన్ని కూడా రెండు సార్లు కడిగి తర్వాత దానిని మిక్సీ గిన్నెలో వేసి అందులోనే కొన్ని నీళ్లు, కొన్ని పచ్చి కొబ్బరిముక్కలు వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి.

- తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి అవసరమనుకుంటే ఇంకొంచెం నీళ్లు కూడా పోసి బాగా పలుచగా పిండి కలుపుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ధోశ పెనం పెట్టి ఉల్లిపాయతో రుద్ది రవ్వ దోశ ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోండి. అంతే నారు ోశ రెడీ.

-ఈ నీరు దోశని చికెన్ లేదా మటన్ కుర్మాతో గానీ లేదా మీకు నచ్చిన చట్నీతో తింటే టేస్ట్ యమా రుచిగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Friday, February 7, 2025, 20:30 [IST]
Desktop Bottom Promotion