Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
మీ జీవితంలో ఇలాంటి సాంబార్ తిని ఉండరు, టేస్ట్ అదరహో, ఎలా చేసుకోవాలో తెలుసా?
పప్పు, సాంబార్ చాలా మందికి ఇష్టమైన కాంబినేషన్. అన్నంలో పప్పు ఉందంటే కచ్చితంగా సాంబార్ ఉండాల్సిందే. అయితే ఎప్పుడూ ఒకేరకమైన సాంబార్ తిని బోర్ కొడుతుందా? ఏదైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఆంధ్రలో ఎంతో ప్రత్యేకమైన మామిడి పప్పు సాంబార్ తినాల్సిందే. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. చేసుకోవడం కూడా ఈజీ. ఈ స్టోరీలో ఈ మామిడి పప్పు సాంబార్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మామిడి పప్పు కావలసిన పదార్థాలు:
కందిపప్పు: ఒక కప్పు
మామిడికాయ: 1 (చిన్న ముక్కలుగా కోయాలి)
ఉల్లిపాయ: 1 (సన్నగా తరగాలి)
టమాటా: 1 (ముక్కలుగా కోయాలి)
పచ్చిమిర్చి: 2 (చీలికలు చేయాలి)
కరివేపాకు: 2 రెబ్బలు
చింతపండు: చిన్న నిమ్మకాయ సైజు అంత
పసుపు: అర టీస్పూన్
కారం: ఒక టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు: ఒక టీస్పూన్
జీలకర్ర: అర టీస్పూన్
మెంతులు: పావు టీస్పూన్
ఇంగువ: చిటికెడు

తయారుచేయు విధానం:
- ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి, తగినంత నీళ్లు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే చింతపండును నీళ్లలో నానబెట్టి రసం తీయాలి.
- ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
- ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి.
- ఆ తరువాత చింతపండు రసం పోసి బాగా కలపాలి. అలాగే ఉడికించిన కందిపప్పును వేసి బాగా కలపాలి. అనంతరం సాంబారును 5-10 నిమిషాలు ఉడికించాలి. అంతే ఎంతో రుచికరమైన మామిడి పప్పు సాంబార్ రెడీ అయినట్లే. దీనిని అన్నంలో వేసుకొని తింటే, అబ్బా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications