మన పూర్వికులు డజన్ల కొద్దీ పిల్లలను కనడానికి ఈ రొట్టెనే తినేవారు.. శక్తి డబుల్,ఎలా చేసుకోవాలంటే?

ప్రస్తుతమైతే అందరూ రసాయనాలు వాడిన ఆహార పదార్థాలు తింటున్నారు కానీ, మన పూర్వికులు మాత్రం స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకునే వారు. వారే జొన్నలు, సజ్జలు, రాగులు, వరి పండించి, వారే వాటిని ఆడించుకొని మరీ తినే వారు. అందుకే వారు ఎలాంటి రోగాలు లేకుండా వందల సంవత్సరాలు జీవించగలిగారు. దీంతో పాటు డజన్ల కొద్దీ పిల్లలకు జన్మనివ్వగలిగారు. అలాంటి ఆహారాల్లో ఒకటి సజ్జ రొట్టె.

ఈ సజ్జ రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలన్నిటినీ ఇది అందజేస్తుంది. షుగర్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. వేడిని తగ్గించి వీర్యకణాల వృద్ధి సరిగ్గా ఉండే విధంగా, సక్రమంగా సంతానం పొందే విధంగా సహాయపడుతుంది. ఇప్పటి వరకు చాలా మంది చపాతీ, జొన్నరొట్టె చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ ఈ సజ్జరొట్టెను ఎలా చేసుకోవాలో తెలియదు. ఈ స్టోరీలో మేము వివరించాము పూర్తిగా చదివి తెలుసుకోండి.

సజ్జ రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు

సజ్జ పిండి - 1 కప్పు
గోధుమ పిండి - 1/4 కప్పు (ఐచ్ఛికం)
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 1 టేబుల్ స్పూన్
నీరు - తగినంత

తయారీ విధానం:

ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి. అందులో ఒక కప్పు సజ్జ పిండి, పావు కప్పు గోధుమ పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తరువాత ఆ పిండిని బాగా కలుపుకోవాలి. అనంతరం ఆ పిండిని కొద్దీ కొద్దిగా నీరు కలుపుతూ.. మరీ లూజ్ కాకుండా, మరీ టైట్‌గా కాకుండా పిండిని కలుపుకోవాలి.

ఆ తరువాత ఆ పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తరువాత ఆ ఉండలను రొట్టెలు చేసుకోవాలి. ఆ రొట్టెలను పెనంపై వేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. కాలే సమయంలో వాటిపై కొద్దిగా నూనె పూసుకొని మృదువుగా కాల్చుకుంటే.. ఎంతో శక్తినిచ్చే.. పోషకాల కొండ అయిన సజ్జ రొట్టె సిద్ధమైనట్లే. ఈ రొట్టెలను పప్పు లేదా ఏదైనా కూరలో తింటే మాత్రం ఆహా అనాల్సిందే.

[ of 5 - Users]
Story first published: Monday, January 20, 2025, 13:07 [IST]
Desktop Bottom Promotion