Latest Updates
-
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు! -
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది నాడు తప్పక చేయాల్సిన 5 పనులు..పచ్చడి తింటూ చదవాల్సిన శ్లోకం..ధర్మసింధు ఏం చెబుతోంది? -
ఉగాది 2026-27 రాశి ఫలాలు..పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశికి రాజయోగం? ఏ రాశికి అవమానం? -
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం దోశ..ఎలా చేసుకోవాలంటే
Dahipuri: నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తినేది ఇదే, రుచి అమోఘంగా ఉంటుంది, ఎలా చేసుకోవాలంటే?
మన దేశంలో ఎన్నో రకాల వంటకాలు ఉన్నాయి. గల్లీకో పేరు ఉన్నట్లుగా.. వీధికొక వంట ఫేమస్గా ఉంటుంది. అవి కూడా చాలా రుచిగా తింటే నోట్లో కరిగిపోయే విధంగా ఉంటాయి. ఆ వంటలను చేసుకోవడం కూడా చాలా సులభం. ఇంట్లోనే వాటిని తయారుచేసుకోవచ్చు కూడా. అలాంటి వంటల్లో ఒకటే దహీపూరి. దీనిని ఉత్తర భారత దేశంలో ఎక్కువ ఇష్టంగా తింటూ ఉంటారు. పెరుగు, పూరీల కాంబినేషన్లో ఈ వంటకం ఉంటుంది. దీని రుచి కూడా అమోఘంగా ఉంటుంది. ఈ స్టోరీలో ఈ దహీపురి ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
పూరీలు: 12-15
పెరుగు: 2 కప్పులు
ఉడికించిన బంగాళదుంపలు: 2
ఉడికించిన శనగలు: 1/2 కప్పు
ఉల్లిపాయలు: 1 చిన్నది
టమోటాలు: 1 చిన్నది
కొత్తిమీర: కొద్దిగా
చింతపండు చట్నీ: 2 టేబుల్ స్పూన్లు
పుదీనా చట్నీ: 2 టేబుల్ స్పూన్లు
కారం: 1/2 టీస్పూన్
జీలకర్ర పొడి: 1/2 టీస్పూన్
చాట్ మసాలా: 1/2 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
సేవ్: గార్నిష్ కోసం
తయారీ విధానం:
ముందుగా, ఉడికించిన బంగాళదుంపలను మెత్తగా చేసి, అందులో ఉడికించిన
శనగలు, తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, కొత్తిమీర, కారం, జీలకర్ర పొడి,
చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.
పెరుగును బాగా చిలికి, అందులో కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
పూరీలను చిన్న రంధ్రాలు చేసి, అందులో బంగాళదుంప మిశ్రమాన్ని
నింపాలి.
పూరీలపై పెరుగు, చింతపండు చట్నీ, పుదీనా చట్నీ వేయాలి.
చివరగా, సేవ్, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
దహీపూరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:
ప్రోబయోటిక్స్: పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి,
ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
కాల్షియం: పెరుగులో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలను
బలంగా ఉంచుతుంది.
ప్రోటీన్: బంగాళదుంపలు, శనగలలో ప్రోటీన్ ఉంటుంది,
ఇది కండరాలను బలంగా ఉంచుతుంది.
విటమిన్లు, ఖనిజాలు: ఉల్లిపాయలు, టమోటాలు,
కొత్తిమీరలో విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని
పెంచుతాయి.
ఫైబర్: శనగలలో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకాన్ని
నివారిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












