Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఈ వీకెండ్లో రొయ్యల బిర్యానీని ఇలా ట్రై చేస్తారా..!!
రొయ్యల బిర్యానీని మనం అన్ని బిర్యానీల్లో రొయ్యల బిర్యానీ వేరయా అని చెప్పుకోవచ్చు. ఈ బిర్యానీ వంటకాలు మన దేశంలో మస్లిములు పాలించినప్పటి నుంచి వచ్చాయ్. హైదరాబాద్ బిర్యానీ కూడా అలాగే వచ్చింది. తరువాత రకరకాల కూరగాయలతో బిర్యానీ చేయడం మొదలుపెట్టారు. అలా రొయ్యలతో కూడా బిర్యానీని చేసుకున్నాం. ఈ వీకెండ్లో ఒకసారి రొయ్యల బిర్యాని రెసిపీని ట్రై చేయండి. రొయ్యల బిర్యానీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి రొయ్యల బిర్యానీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

రొయ్యల బిర్యానీ తయారు చేయడానికి కావాల్సి పదార్ధాలు ఇవే :
బస్మతి బియ్యం: 2 కప్పులు
రొయ్యలు: 500 గ్రాములు
ఉల్లిపాయలు: 2
టమోటా: 1
పచ్చి మిరపకాయలు: 3-4
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2 టీస్పూన్లు
పుదీనా, కొత్తిమీర ఆకులు
మసాలా పదార్థాలు: ధనియాల పొడి, జీడి కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ
మసాలా, బిర్యానీ ఆవాలు
ఉప్పు
ఉల్లిపాయలు
నెయ్యి, నూనె
ఎండుమిరపకాయలు: 2-3
ఎల్లో ఫుడ్ కలర్: ఒక చిటికెడు
రొయ్యల బిర్యానీ తయారు చేసే విధానం :
1. ముందుగా, బాస్మతి బియ్యం నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత, నీటిని వడకట్టి, కాస్త ఉప్పు, నూనె వేసి 70% సిద్దమయ్యే వరకు ఉడికించాలి. ఉడికిన బియ్యాన్ని వడగట్టి పక్కన పెట్టాలి.
2. ఒక పెద్ద గిన్నెలో నెయ్యి లేదా నూనెతో నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిపాయలు గోధుమరంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు జోడించి రెండు నిమిషాల పాటు వేపాలి.
3. మసాలా తగినంత ఫ్రై అయిన తరువాత, రొయ్యలు వేసి, పసుపు, ధనియాల పొడి, జీడి కారం, బిర్యానీ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. రొయ్యలు సన్నని మంట మీద 5-6 నిమిషాల పాటు వేపి, టమోటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి మరో 2 నిమిషాలు వేయించాలి.
4. ఒక బిర్యానీ పాత్ర తీసుకొని అందులో మసాలాను వేసుకోవాలి. మసాలా పైన ఉడికిన బిర్యానీని వేసుకోవాలి. ఇలా రెండు మూడు లేయర్లుగా చేయాలి. ఎల్లో కలర్ చిటికెడు వేసి మూత పెట్టి 20 నిమిశాల వరకు దమ్ పై ఉడికించాలి.
5. ఇక తరువాత మీ రొయ్యల బిర్యానీ రెడీ అయినట్టే. ప్లేటులో సర్వ్ చేసుకొని సలాడ్, పెరుగు, మిర్చి సలాన్ కర్రీతో కలుపుకొని తినేయడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications