Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
ఈ వీకెండ్లో రొయ్యల బిర్యానీని ఇలా ట్రై చేస్తారా..!!
రొయ్యల బిర్యానీని మనం అన్ని బిర్యానీల్లో రొయ్యల బిర్యానీ వేరయా అని చెప్పుకోవచ్చు. ఈ బిర్యానీ వంటకాలు మన దేశంలో మస్లిములు పాలించినప్పటి నుంచి వచ్చాయ్. హైదరాబాద్ బిర్యానీ కూడా అలాగే వచ్చింది. తరువాత రకరకాల కూరగాయలతో బిర్యానీ చేయడం మొదలుపెట్టారు. అలా రొయ్యలతో కూడా బిర్యానీని చేసుకున్నాం. ఈ వీకెండ్లో ఒకసారి రొయ్యల బిర్యాని రెసిపీని ట్రై చేయండి. రొయ్యల బిర్యానీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి రొయ్యల బిర్యానీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
రొయ్యల బిర్యానీ తయారు చేయడానికి కావాల్సి పదార్ధాలు ఇవే :
బస్మతి బియ్యం: 2 కప్పులు
రొయ్యలు: 500 గ్రాములు
ఉల్లిపాయలు: 2
టమోటా: 1
పచ్చి మిరపకాయలు: 3-4
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2 టీస్పూన్లు
పుదీనా, కొత్తిమీర ఆకులు
మసాలా పదార్థాలు: ధనియాల పొడి, జీడి కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ
మసాలా, బిర్యానీ ఆవాలు
ఉప్పు
ఉల్లిపాయలు
నెయ్యి, నూనె
ఎండుమిరపకాయలు: 2-3
ఎల్లో ఫుడ్ కలర్: ఒక చిటికెడు
రొయ్యల బిర్యానీ తయారు చేసే విధానం :
1. ముందుగా, బాస్మతి బియ్యం నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత, నీటిని వడకట్టి, కాస్త ఉప్పు, నూనె వేసి 70% సిద్దమయ్యే వరకు ఉడికించాలి. ఉడికిన బియ్యాన్ని వడగట్టి పక్కన పెట్టాలి.
2. ఒక పెద్ద గిన్నెలో నెయ్యి లేదా నూనెతో నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిపాయలు గోధుమరంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు జోడించి రెండు నిమిషాల పాటు వేపాలి.
3. మసాలా తగినంత ఫ్రై అయిన తరువాత, రొయ్యలు వేసి, పసుపు, ధనియాల పొడి, జీడి కారం, బిర్యానీ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. రొయ్యలు సన్నని మంట మీద 5-6 నిమిషాల పాటు వేపి, టమోటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి మరో 2 నిమిషాలు వేయించాలి.
4. ఒక బిర్యానీ పాత్ర తీసుకొని అందులో మసాలాను వేసుకోవాలి. మసాలా పైన ఉడికిన బిర్యానీని వేసుకోవాలి. ఇలా రెండు మూడు లేయర్లుగా చేయాలి. ఎల్లో కలర్ చిటికెడు వేసి మూత పెట్టి 20 నిమిశాల వరకు దమ్ పై ఉడికించాలి.
5. ఇక తరువాత మీ రొయ్యల బిర్యానీ రెడీ అయినట్టే. ప్లేటులో సర్వ్ చేసుకొని సలాడ్, పెరుగు, మిర్చి సలాన్ కర్రీతో కలుపుకొని తినేయడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












