Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
ఈ వీకెండ్లో రొయ్యల బిర్యానీని ఇలా ట్రై చేస్తారా..!!
రొయ్యల బిర్యానీని మనం అన్ని బిర్యానీల్లో రొయ్యల బిర్యానీ వేరయా అని చెప్పుకోవచ్చు. ఈ బిర్యానీ వంటకాలు మన దేశంలో మస్లిములు పాలించినప్పటి నుంచి వచ్చాయ్. హైదరాబాద్ బిర్యానీ కూడా అలాగే వచ్చింది. తరువాత రకరకాల కూరగాయలతో బిర్యానీ చేయడం మొదలుపెట్టారు. అలా రొయ్యలతో కూడా బిర్యానీని చేసుకున్నాం. ఈ వీకెండ్లో ఒకసారి రొయ్యల బిర్యాని రెసిపీని ట్రై చేయండి. రొయ్యల బిర్యానీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి రొయ్యల బిర్యానీని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

రొయ్యల బిర్యానీ తయారు చేయడానికి కావాల్సి పదార్ధాలు ఇవే :
బస్మతి బియ్యం: 2 కప్పులు
రొయ్యలు: 500 గ్రాములు
ఉల్లిపాయలు: 2
టమోటా: 1
పచ్చి మిరపకాయలు: 3-4
అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2 టీస్పూన్లు
పుదీనా, కొత్తిమీర ఆకులు
మసాలా పదార్థాలు: ధనియాల పొడి, జీడి కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ
మసాలా, బిర్యానీ ఆవాలు
ఉప్పు
ఉల్లిపాయలు
నెయ్యి, నూనె
ఎండుమిరపకాయలు: 2-3
ఎల్లో ఫుడ్ కలర్: ఒక చిటికెడు
రొయ్యల బిర్యానీ తయారు చేసే విధానం :
1. ముందుగా, బాస్మతి బియ్యం నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత, నీటిని వడకట్టి, కాస్త ఉప్పు, నూనె వేసి 70% సిద్దమయ్యే వరకు ఉడికించాలి. ఉడికిన బియ్యాన్ని వడగట్టి పక్కన పెట్టాలి.
2. ఒక పెద్ద గిన్నెలో నెయ్యి లేదా నూనెతో నూనె వేడి చేయాలి. అందులో ఉల్లిపాయలు గోధుమరంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు జోడించి రెండు నిమిషాల పాటు వేపాలి.
3. మసాలా తగినంత ఫ్రై అయిన తరువాత, రొయ్యలు వేసి, పసుపు, ధనియాల పొడి, జీడి కారం, బిర్యానీ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. రొయ్యలు సన్నని మంట మీద 5-6 నిమిషాల పాటు వేపి, టమోటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర ఆకులు వేసి మరో 2 నిమిషాలు వేయించాలి.
4. ఒక బిర్యానీ పాత్ర తీసుకొని అందులో మసాలాను వేసుకోవాలి. మసాలా పైన ఉడికిన బిర్యానీని వేసుకోవాలి. ఇలా రెండు మూడు లేయర్లుగా చేయాలి. ఎల్లో కలర్ చిటికెడు వేసి మూత పెట్టి 20 నిమిశాల వరకు దమ్ పై ఉడికించాలి.
5. ఇక తరువాత మీ రొయ్యల బిర్యానీ రెడీ అయినట్టే. ప్లేటులో సర్వ్ చేసుకొని సలాడ్, పెరుగు, మిర్చి సలాన్ కర్రీతో కలుపుకొని తినేయడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications