Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
రాగి మటన్ ఖీమా, అబబబ్బ ఒక్క ముద్ద తింటే జీవితంలో మళ్ళీ మర్చిపోరు, సింపుల్గా ఎలా చేసుకోవాలంటే?
రాగి జావా, రాగి బిస్కెట్స్, రాగి రోటి ఇలా ఎన్నో రకాల వంటలను రుచి చేసే ఉంటారు. కానీ మీరెప్పుడైనా రాగి మటన్ ఖీమా ట్రై చేశారా? ఒక్క స్పూన్ ఈ రాగి మటన్ ఖీమా నోట్లో వేసుకుంటే లాలాజలం ఆ ఊరి రావాల్సిందే. ఇప్పుడిప్పుడే మన హైదరాబాద్లో దీనికి సంబంధించిన రెస్టారెంట్లు వస్తున్నాయి. రెస్టారెంట్లలో కంటే ముందే, ఈ రాగి మటన్ ఖీమాను ట్రై చేయాలనుకునే వారికోసం రాగి మటన్ ఖీమా ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
మటన్ ఖీమా - 1/2 కిలో
రాగి పిండి - 1/2 కప్పు
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
టమోటాలు - 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి)
కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది)
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కారం - 1 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1/2 టీస్పూన్
తయారుచేసే విధానం:
- ముందుగా, మటన్ ఖీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
- ఒక పాన్ లో నూనె వేడి చేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
- తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
- తర్వాత టమోటాలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
- ఇప్పుడు మటన్ ఖీమా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
- కొద్దిగా నీరు పోసి ఖీమాను మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
- ఖీమా ఉడికిన తర్వాత, రాగి పిండిని కొద్దిగా నీటిలో కలిపి పాన్ లో వేసి బాగా కలపాలి.
- కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలిపి, రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే రాగి మటన్ ఖీమా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












