Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
అడాయ్ని ఈ స్టైల్లో ఎప్పుడైనా చేసుకున్నారా..? బియ్యం పిండితో క్రీస్పీ, స్పాంజీ రెసిపీ..!!
బియ్యం పిండితో చేసే అడాయ్ను బ్రేక్ ఫాస్ట్ గా చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం స్నాక్గా అయినా రెడీ చేసుకోవచ్చు. క్రిస్పీగా, స్పైసీగా, స్పాంజీగా చాలా బాగుంటాయ్. ఎన్ని తిన్నా కూడా కడుపు నిండుగా అనిపించదు. దోశలు అంటే బోర్ అనుకునేవాళ్లు ఈ అడాయ్ రెసిపీని చేసుకోవచ్చు. ఈ అడాయ్ను ఎలా రెడీ చేస్తారో తెలుసుకుందాం.
బియ్యంపిండితో చేసే అడాయ్ కోసం కావాల్సిన వంట పదార్ధాలు ఇవే :
అర అంగులం అల్లం ముక్క
3 వెల్లుల్లిపాయలు
2 పచ్చిమిరపకాయలు
1 కప్పు బియ్యం పిండి
అరకప్పుపెరుగు
అర టీస్పూన్ జిలకర
అరకప్పు క్యారెట్ తురుము
అరకప్పు క్యాబేజ్
అరకప్పు టమాటా ముక్కలు
ఒక క్యాప్సికం
అర టీస్పూన్ కారంపొడి
2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులు
అర టీస్పూన్ బేకింగ్ సోడా
2 స్పూన్ల మంచి నూనె
నువ్వులు
క్రిస్పీ అడాయ్ను ఈ కింది విధంగా తయారు చేసుకోవాలి.
1. చిన్న మిక్సీ జార్లో అర అంగులం అల్లం ముక్కను, 3 వెల్లుల్లిపాయలను, 2 పచ్చిమిరపకాయలను వేసుకొని బాగా దంచాలి. మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇందులో అరకప్పుపెరుగును వేసుకోవాలి. దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అవసరానికి సరిపడ నీళ్లను పోసుకోవాలి.
2. దోశలు వేసుకునే విధంగా పిండిలో నీళ్లు పోసుకొని కలపాలి. మనం కలుపుకున్న పిండికి 1 కప్పు నీళ్ల వరకు సరిపోతుంది. ఇంతకు ముందు దంచిన పచ్చిమిర్చి పేస్టును బౌల్లో వేసుకోవాలి. అర టీస్పూన్ జిలకరను, అరకప్పు క్యారెట్ తురుమును వేసుకోవాలి. అరకప్పు క్యాబేజ్ను వసుకోవాలి. అరకప్పు టమాటా ముక్కలను, సన్నగా తరిగిన ఒక క్యాప్సికంను ముక్కలుగా కోసి వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, అర టీస్పూన్ కారంపొడిని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆకులను వేసుకోవాలి.
3. బౌల్లో ఉన్న మొత్నాన్నీ బాగా కలిసి పదినిమిశాలు అలాగే పెట్టి మూత పెట్టాలి. ఇందులో అర టీస్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. ఇప్పుడు పెనంను స్టవ్ పైన పెట్టుకొని 2 స్పూన్ల మంచి నూనెను వేసుకోవాలి. పెనంపై రెండు చిటికెల నువ్వులను వేసుకొని రెండు గరిటెల పిండిని వేసుకోవాలి. ప్యాన్ పైన మూతపెట్టి రెండు నిమిశాల మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలి.
4. ఒక సైడు కాలిన తరువాత మళ్లీ రెండో వైపు కూడా పెనంపై కాల్చాలి. ఇలాగే రెండు నిమిశాలు మూతపెట్టి కాల్చడం వల్ల అడాయ్ రెడీ అవుతుంది. ఇదే విధంగా కలుపుకున్న పిండి మొత్తం చేసుకోవాలి. దీంతో అడాయ్ రెడీ అయినట్టే.
5. ఈ అడాయ్ను టమాట సాస్ లేదంటే కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












