Sankranti 2025: సంక్రాంతి స్పెషల్ బెల్లం నువ్వుల ఉండలు.. ఎలా చేసుకోవాలంటే?

సంక్రాంతి వచ్చేస్తుంది. ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటి నుంచే సంక్రాంతి ఏర్పాట్లను ప్రతి ఒక్కరూ మొదలుపెట్టేశారు. అందులో భాగంగా సంక్రాంతికి ప్రత్యేకమైన వంటలు చేయడం ప్రారంభించారు. సంక్రాంతికి పిండి వంటలు, స్వీట్స్ ప్రత్యేకంగా చేసుకుంటారు. వాటిల్లో బెల్లం నువ్వుల ఉండలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇవి తినడానికి చాలా తీపిగా ఉంటాయి. అలాగే శరీరానికి కూడా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఈ బెల్లం నువ్వుల ఉండలు ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బెల్లం నువ్వుల ఉండలు తయారీకి కావాల్సిన పదార్థాలు

నువ్వులు - 1 కప్పు
బెల్లం - 1 కప్పు
నెయ్యి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - చిటికెడు
ఎండుమిరపకాయలు - 2-3

తయారీ విధానం:

ముందుగా నువ్వులను శుభ్రంగా కడుక్కొని వరిగించుకోవాలి. వరిగించిన తరువాత వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తరువాత ఓ పాత్రలో బెల్లం వేసి, అందులో కొద్దిగా నీరు పోసి బాగా ఉడికించాలి. బెల్లం కరిగి పాకం పట్టుకోవడానికి అనువైన స్థితికి వచ్చే వరకు వేడి చేసుకోవాలి. ఆ తరువాత కరిగిన బెల్లంలో వరిగించిన నువ్వులు, జీలకర్ర, ఎండు మిరపకాయలు వేసుకొని బాగా కలిపారు.

ఆ తరువాత ఆ నువ్వుల మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. అనంతరం వాటిపైన నెయ్యి రాశి ప్లేట్‌లో సరిగ్గా అమర్చుకోవాలి. అలా అమర్చుకున్న తరువాత చల్లార్చుకోవాలి. అనంతరం వాటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో నిల్వ చేసుకుంటే ఎంతో రుచికరమైన సంక్రాంతి స్పెషల్ బెల్లం నువ్వుల ఉండవు సిద్ధమైనట్లే.

ఈ బెల్లం నువ్వుల ఉండలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. శరీరానికి కావాల్సిన ఐరన్ అందండంతో పాటు తక్షణ శక్తి అందుతుంది. దీంతో పాటు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో HMPV వైరస్ లాంటి వైరస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Tuesday, January 7, 2025, 10:45 [IST]
Desktop Bottom Promotion