నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది..షీర్ కుర్మా ఇలా చేసుకోండి

Posted By:

సాధారణంగా రంజాన్ లేదా ఈద్ సమయంలో ఎక్కువగా షీర్ కుర్మా చేస్తుంటారు. ఈ పండుగల సమయంలో అందరి ముస్లింల ఇళ్లల్లో మాత్రమే కాకుండా రెస్టారెంట్స్ లో కూడా స్పెషల్ గా దీన్ని తయారుచేసి వడ్డిస్తారు. ఈ షీర్ కుర్మా నోట్లో పెట్టుకుంటే అలా జారిపోతుంది. దీని టేస్ట్ మరేఇతర పాయసానికి రాదంటే ఆశ్చర్యం లేదు. కొంతమంది అయితే షీర్ కుర్మా తినడానికే పుట్టాం అని కూడా సరదాగా అంటుంటారు. అయితే ఈ షీర్ కుర్మాని ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలి,దీనిని చేయడానికి ఏమేం పదార్థాలు కావాలో ఇక్కడ చూడండి.

షీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు 1 లీటర్
-ఎండు ద్రాక్షలు 7
-బాదంపప్పు 10
-జీడిపప్పుు 10
-పిస్తా పప్పులు 15
-నెయ్యి 6 టేబుల్ స్పూన్లు
-చిరోంజి పప్పు 2 టేబుల్ స్పూన్లు
-పంచదార 250 గ్రాములు
-కండెన్స్డ్ మిల్క్ 300 ml
-సేవియా 1 కప్పు

షీర్ కుర్మా తయారీ విధానం

-ముందుగా విడి విడిగా ఎండుద్రాక్ష, జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పుని రాత్రంతా నానబెట్టుకోండి.

-తర్వాత నానబెట్టిన ఎండు ఖర్జూరంలోని గింజలు తీసేసి పొడవుగా ఖర్చూరాన్ని చీరుకోవాలి. జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాదంపప్పు చెక్కు తీసేసి సన్నగా తరుగుకోవాలి. పిస్తా పప్పులను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

-ఇప్పుడు పాన్ లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో కట్ చేసిన ఈ ముక్కలన్నింటిని వేసేయండి. ఇందులోనే చిరోంజి పప్పు కూడా వేసి బాగా వేపి పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు పాన్ లో మరో 3 కప్పుల నెయ్యి వేడి చేసి అందులో 1కప్పు సేవియా(saviya) వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే దాకా వేయించి పక్కనపెట్టుకోండి

-తర్వాత అడుగు మందంగా ఉండే గిన్నెలో 1 లీటర్ పాలు మరిగించుకోవాలి.

-పాలు కొంచెం మరిగాక అందులో 300 ఎమ్ఎల్ కండెన్స్డ్ మిల్క్ లేదా పావు కేజీ పంచదార వేసి కలపండి. తర్వాత ఇందులోనే ఎండుద్రాక్ష వేసి బాగా కలపండి.

-5 నిమిషాల పాటు మరిగిన తర్వాత అందులో ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు, బాదం,పిస్తా,చిరోంజి పప్పులను వేసి మొత్తం బాగా కలపాలి.

-తర్వాత ఇందులోనే ఫ్రై చేసిన సేవియా, అర టీస్పూన్ ఏలకల పొడి వేసి కలపండి. తక్కువ మంట మీద 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక పొంగు రాగానే దించేయండి. అంతే షీర్ కుర్మా రెడీ.

[ of 5 - Users]
Story first published: Thursday, January 23, 2025, 15:18 [IST]
Desktop Bottom Promotion