Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ఈ స్టైల్లో వెజిటేబుల్ బిర్యానీ చేస్తే.. చికెన్ బిర్యానీ కూడా బలాదూరే..!
వీకెండ్ లో నార్మల్ కూర కాకుండా ఈ సారి వెజిటేబుల్ బిర్యానీ చేసుకోవడానికి రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాము. ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే చాలా సింపుల్గా టేస్టీగా ఈ వెజిటేబల్ బిర్యానీని రెడీ చేసుకోవచ్చు.
వెజిటేబుల్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్ధాలు
2 గ్లాసుల వరకు బాస్మీతీ రైస్
మంచి నూనె
ఒక కప్పు ఉల్లిపాయలు
జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, బగారా ఆకు, 2 యాలాకులు, 10
కాజూలు
కట్ చేసిన 5 పచ్చిమిరపకాయ ముక్కలు
1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు
1 కప్పు ఆలుగడ్డ ముక్కలు
1/2 కప్పు టమాట ముక్కలు
1/4 కప్పు బఠానాలు
ముప్పావు కప్పు పెరుగు
పావు టీస్పూన్ పసుపు
1 టీ స్పూన్ ధనియాల పొడి
1 టీ స్పూన్ కారంపొడి
1 టీస్పూన్ గరరం మసాలా
రైతా, నిమ్మకాయ
వెజిటేబుల్ బిర్యానీ తయారు చేసే విధానం
1. ఒక బౌల్లో 2 గ్లాసుల వరకు బాస్మీతీ రైస్ను తీసుకని బాగా కడిగి
నీళ్లు పోసి 30 నిమిశాలు నానబెట్టాలి.
2. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని, 2 టేబుల్ స్పూన్ల మంచి
నూనెను పోసుకొని వేడి చేయాలి.
3. సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి.
4. అన్ని గరంమసాలాలను తగినంతగా తీసుకోవాలి. జీలకర్ర, లవంగాలు, దాల్చిన
చెక్క, బగారా ఆకు, 2 యాలాకులు, 10 కాజూలు తీసుకోవాలి.
5. కుక్కర్లో ఉల్లిపాయ ఫ్రై అయిన తరువాత బగారాను వేసుకొని
కలుపుకోవాలి.
6. కట్ చేసిన 5 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి.
7. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని కలుపుకోవాలి.
8.1 కప్పు ఆలుగడ్డ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి.
9. 1/2 కప్పు టమాట ముక్కలను కూడా వేసుకోవాలి.
10. 1/4 కప్పు బఠానాలను కూడా వేసుకోవాలి.
11. హై ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ కలపాలి.
12. కుక్కర్కు మూతపెట్టి 3 నిమిశాలు ఉడికించాలి.
13. గిన్నెలో ముప్పావు కప్పు పెరుగును తీసుకోవాలి.
14. గిన్నెలో పావు టీస్పూన్ పసుపును, 1 టీ స్పూన్ ధనియాల పొడిని, 1 టీ
స్పూన్ కారంపొడి, రుచికి సరిపడ ఉప్పును తీసుకోవాలి.
15. 1 టీస్పూన్ గరరం మసాలా పొడిని వేసుకోవాలి.
16. కుక్కర్లో కలిపిపెట్టిన మసాలాను వేసుకోవాలి.
17. నానబెట్టిన రైస్ను కూడా కుక్కర్లో వేసుకోవాలి.
18. కుక్కర్లో రెండున్నర గ్లాసుల నీళ్లను కూడా పోసుకోవాలి.
19. టేస్టుకు సరిపడ ఉప్పు వుందా లేదా చెక్ చేసుకోవాలి.
20. కుక్కర్ మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు చూడాలి.
21. ఇక దీంతో వెజ్ బిర్యానీ రెడీ అయినట్టే.
22. రైతాతో ఈ వెజ్ బిర్యానీని సర్వ చేసుకుంటే చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













