Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
నూనె లేకుండా ఆరోగ్యకరమైన పూరీలు.. ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే?
పూరీలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఉదయాన్నే టిఫిన్ చేసేటప్పుడు చాలా మంది పూరీలు తినడానికి ఇష్టపడుతుంటారు. అంత రుచిగా ఉండే ఈ పూరీలను బరువు తగ్గాలనుకునే వ్యక్తులు, కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు మాత్రం తినలేరు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా నూనె ఉండడంతో పాటు ఎక్కువగా క్యాలరీలు ఉంటాయి. దీని కారణంగా బరువు తగ్గాలనుకునే వ్యక్తులు, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు వారికి తినాలని ఉన్నా తినలేరు.
అలాంటి వారికోసం ప్రస్తుతం మార్కెట్లోకి నూనె లేని పూరీలు వచ్చేశాయి. ప్రస్తుతం ట్రేడింగ్లో ఉన్న ఈ ప్రాసెస్ను ఎలా చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధమైన పద్దతిలో నూనె లేకుండా పూరీలు చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం.

నూనె లేకుండా పూరీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
- ఒక కప్పు గోధుమ పిండి
- రెండు టేబుల్ స్పూన్ల పెరుగు
- రుచికి తగినంత ఉప్పు
- పిండి కలుపుకునేందుకు సరిపడా నీళ్లు
- ఎయిర్ ఫ్రయర్(ఇది తప్పనిసరి)
నూనె లేకుండా పూరీలు తయారు చేసుకునే విధానం
- ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గోధుమ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని బాగా సాగే విధంగా ఒత్తుతూ మెత్తగా కలుపుకోవాలి.
- పిండిని బాగా కలుపుకున్నాక.. ఆ పిండిపై ఒక మూత పెట్టి, దానిని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయాలి. ఇలా పిండిని ఉంచితే పిండి కొంచెం పిలుస్తుంది. దీంతో పూరీలు బాగా పొంగుతాయి. ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఆ తరువాత ఆ ఉండలను కొంచెం మందంగానే సాగే విధంగా పూరీలుగా చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పూరీలను చపాతీ కర్రతో ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చపాతీలో ఒత్తడానికి ముందే ఒక గిన్నెల్లో నీళ్లను ఉడకబెట్టుకోవాలి. ఆ నీటిలో మనం ఒత్తి పెట్టుకున్న పూరీలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ.. ఒక్కో పూరీని రెండు నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి.
- రెండు నిమిషాల పాటు పూరీలన్నీ ఉడికిపోయాక వాటిని బయటికి తీసి.. వాటిపై ఉండే నీటిని మొత్తాన్ని తుడిచేయాలి. అనంతరం ఆ పూరీలను ఎయిర్ ఫ్రయర్లో వేసుకొని సుమారు 180 డిగ్రీల సెల్సియస్ వద్ద హీట్ చేసుకోవాలి. ఒక అయిదు నిమిషాల పాటు పూరీలను ఎయిర్ ఫ్రయర్లో హీట్ చేసుకొని బయటికి తీసుకోవాలి.
- ఎయిర్ ఫ్రయర్లో ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పూరీలను పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక పూరిపై ఇంకో పూరి ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఒకదానిపై ఇంకోటి ఉంటే పూరీలు ఉబ్బకపోవడంతో పాటు, పూరీలు అనుకున్న విధంగా వచ్చే అవకాశం ఉండదు.
- ఇలా అన్ని పూరీలను ఎయిర్ ఫ్రయర్లో అయిదు నిమిషాల పాటు ఉడకబెట్టుకుంటే ఎలాంటి ఆయిల్ లేకుండా పూరీలను రెడీ చేసుకోవచ్చు. వాటిని ఒక ప్లేట్లో తీసుకొని వేడి వేడిగా కుర్మా లేదా చట్నీతో ఎంజాయ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications