Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
పుట్టగొడుగుల కూరను.. ఈ స్టైల్లో చేసుకుంటే.. రోజూ తినాలనిపిస్తుంది..!
పుట్టగొడుగులను ఎప్పుడైనా తిన్నారా. అంటే ఈ కూరను ఇప్పటి వరకు తినని వాళ్లు చాలా మంది వున్నారు. బటయ కర్రీ పాయింట్లలో కూడా ఈ కూర సులభంగా అందుబాటులో వుండదు. పుట్టగొడుగులను రుచిగా ఎలా తయారు చేసుకోవాలో మీకు అందించబోతున్నాం. చాలా సింపుల్గా, ఇంట్లో వున్న వంట సామాగ్రితోనే మష్రూం కర్రీని రెడీ చేసుకోవచ్చు.
మష్రూమ్ కరీ కోసం కావాల్సిన వంట పదార్ధాలు
200 గ్రాముల మష్రూంలు
ఉప్పు
మంచి నూనె
1 బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 5 యాలాకులు, అర టీ స్పూన్ జిలుకర
ఉల్లిపాయ
యాలాకులు
జిలుకర
2 టమాటాలు
1 అల్లం ముక్క
12 వెల్లుల్లి ముక్కలు
10 జీడిపప్పు
2 పచ్చిమిరపకాయలు
పావు టీ స్పూన్ పసుపు
2 టీ స్పూన్ల కారంపొడి
1 టీ స్పూన్ ధనియాల పొడి
కసూరి మేతి
అర టీస్పూన్ గరం మసాలా
కొత్తిమీర ఆకులు
మష్రూమ్ కర్రీ తయారు చేసే విధానం
1. ముందుగా 200 గ్రామల వరకు మష్రూంలను కడిగి తీసుకోవాలి. మష్రూంపైన వుండే పొరలను, చెత్తను తీసేసుకోవాలి.
2. రెండు మూక్కలుగా మష్రూంలను కట్ చేసుకోవాలి.
3. అర టీస్పూన్ ఉప్ప వేసుకొని నీళ్లు పోసుకొని బాగా కడగాలి.
4. ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను తీసుకోవాలి. ప్యాన్లో మష్రూంను తీసుకొని 4 నిమిశాలు ఫ్రై చేసుకోవాలి.
5. మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా, వాటిని మరో గిన్నెలోకి తీసుకోవాలి.
6. మళ్లీ ప్యాన్లో 2 టేబల్ స్పూన్ల మంచి నూనెను యాడ్ చేసుకోవలి. ఇందులో 1 బిర్యానీ ఆకును, చిన్న దాల్చిన చెక్క,
7. 5 యాలాకులు, అర టీ స్పూన్ జిలుకరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
8. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
9. మిక్సీ గ్రైండర్లో 2 కట్ చేసిన టమాటాలను తీసుకోవాలి. 1 అల్లంముక్కను, 12 వెల్లుల్లి ముక్కలను, 10 జీడిపప్పు పలుకులను మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
10. ప్యాన్లో ఫ్రై అవుతున్న పోప్లో గ్రైండ్ చేసిన టమాట పేస్టును వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
11. పావు టీ స్పూన్ పసుపును, 2 టీ స్పూన్ల కారంపొడిని, 1 టీస్పూన్ ధనియాల పొడిని , రుచికి సరిపడ ఉప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి.
12. ఫ్రై చేసిన మష్రూంలను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ప్యాన్పై మూతను పెట్టి 3 నిమిశాల వరకు బాగా ఉడికించాలి.
13. గ్రేవీకి సరిపడ నీళ్లను పోసుకోవాలి. ప్యాన్పై మూతను పెట్టి 5 నిమిశాల వరకు ఉడికించాలి.
14. కూరలో అర టీస్పూన్ కసూరి మేతిని, అర టీస్పూన్ గరం మసాలాను వేసుకొని బాగా కలుపుకోవాలి. కూరలో కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా కలుపుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications













