Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఎప్పుడైనా పెరుగు పరాఠా తిన్నారా? ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
ఉల్లిపాయ పరాఠా, ఆలూ పరాఠా, క్యాబేజీ, ముల్లంగి, మెంతి, లచ్చా పరాఠా..ఇలా ఎన్నో రకాల పరాఠాలను మనం తరచుగా ఇంట్లో చేసుకుని తింటుంటాం. కానీ మీరు ఎప్పుడైనా దహి పరాఠా(పెరుగు పరాఠా) రుచి చూశారా? ఇది తయారు చేయడం చాలా సులభం మాత్రమే కాదు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేంత మృదువుగా, భలే రుచిగా ఉంటుంది.
ప్రముఖ మాస్టర్ చెఫ్ పంకజ్ భదౌరియా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో దహి పరాఠా రెసిపీని పంచుకున్నారు. నోరూరించే దహి పరాఠా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పెరుగు - అర కప్పు
పాలు - అర కప్పు
గోధుమ పిండి - 2 కప్పులు
ఉప్పు - అర టీస్పూన్
షుగర్ పౌడర్- 2 టీస్పూన్లు
వంట నూనె - 1 టేబుల్ స్పూన్
కార్న్ఫ్లోర్ - అర కప్పు
నూనె - పావు కప్పు
స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లికాడలు) - కొద్దిగా
చిల్లీ ఫ్లేక్స్ - కొద్దిగా
తయారు చేసే విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో పెరుగు, పాలు, ఉప్పు, పొడి చక్కెర వేసి బాగా కలపాలి. ఆ తర్వాత అందులో గోధుమ పిండిని వేసి మెత్తటి ముద్దలా కలుపుకోవాలి. పిండి సులభంగా కలుపుకోవడానికి అవసరమైతే మరికొన్ని పాలు జతచేయవచ్చు.
-పిండి ముద్దలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె పిండికి బాగా పట్టేలా మెత్తగా పిసకాలి. ఇప్పుడు ఈ పిండిపై ఒక శుభ్రమైన తడి గుడ్డను కప్పి సుమారు 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-పిండి నానే లోపు, ఒక చిన్న గిన్నెలో కార్న్ఫ్లోర్, పావు కప్పు నూనె వేసి ఎక్కడా ఉండలు లేకుండా మృదువైన పేస్ట్ లా కలిపి పెట్టుకోవాలి.
-30 నిమిషాల తర్వాత పిండిని మళ్లీ ఓ రెండు నిమిషాల పాటు పిసికి, 5 సమాన భాగాలుగా (ఉండలుగా) చేసుకోవాలి.
-ఒక్కో ఉండను తీసుకుని చపాతీ కర్రతో పెద్ద రోటీలా వత్తుకోవాలి.
-వత్తుకున్న రోటీపై ముందుగా తయారుచేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్-నూనె పేస్ట్ ను అంతటా సమానంగా రాయాలి. ఇప్పుడు చాకు తీసుకుని రోటీ మధ్యలో నుండి చివర వరకు ఒక కట్ చేయాలి.
-దీనిపై కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, సన్నగా తరిగిన పచ్చి ఉల్లికాడలను చల్లాలి. ఆ తర్వాత కట్ చేసిన భాగం నుండి కోన్ ఆకారంలో చుట్టుకుంటూ వచ్చి, ఒక్కో పొరను మడిచి మళ్లీ గుండ్రటి బంతిలా చేసుకోవాలి. ఈ ఉండలను మరో 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
-10 నిమిషాల తర్వాత, ఉండలను మరీ పల్చగా కాకుండా కాస్త మందంగా పరాఠాల్లా వత్తుకోవాలి.
-స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, మీడియం మంట మీద పరాఠాలను వేయాలి. కావలసినంత నెయ్యి లేదా నూనె రాస్తూ పరాఠాలు మంచి రంగులోకి మారి, క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, పొరలు పొరలుగా ఉండే వేడివేడి దహి పరాఠా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications