Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఇడ్లీ పిండి లేదని టెన్షన్ పడుతున్నారా? అప్పటికప్పుడు చేసుకునే మజ్జిగ ఇడ్లీ రెసిపీ ఇదే!
సాధారణంగా మనం మినపప్పు, బియ్యం రవ్వతో ఇడ్లీలు వేసుకుంటాం. ఇడ్లీలలో గోలీ ఇడ్లీ, ఖుష్బూ ఇడ్లీ, తట్టే ఇడ్లీ, కప్పు ఇడ్లీ, మల్లెపువ్వు లాంటి మృదువైన ఇడ్లీ, రవ్వ ఇడ్లీ.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు పిండి రుబ్బడం మర్చిపోతాం లేదా అప్పటికప్పుడు ఏదైనా కొత్తగా తినాలనిపిస్తుంది. అలాంటి సమయాల్లో బెస్ట్ ఆప్షన్ మజ్జిగ ఇడ్లీ.
ఈ మజ్జిగ ఇడ్లీ చాలా మృదువుగా, స్పాంజిలా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే..దీనికోసం ముందు రోజు పప్పు నానబెట్టడం, పిండి రుబ్బడం, రాత్రంతా పులియబెట్టడం వంటి పనులేవీ అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. రుచికరమైన, సులభమైన మజ్జిగ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ - 2 కప్పులు
అటుకులు - ముప్పావు కప్పు
పుల్లటి మజ్జిగ - 1 కప్పు
వంట సోడా - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి
తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో అటుకులను వేసుకుని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి ఇడ్లీకి మంచి ఆకృతిని, మెత్తదనాన్ని ఇస్తుంది.
-ఒక పెద్ద గిన్నెలో రెండు కప్పుల బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) తీసుకోండి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న అటుకుల పొడిని వేసి కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు పుల్లటి మజ్జిగను వేసి బాగా కలపాలి. మజ్జిగ వేయడం వల్ల ఇడ్లీకి మంచి రుచి వస్తుంది. మిశ్రమం గట్టిగా ఉంటే తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా జారుగా కలుపుకోవాలి.
-అందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి కలపాలి. ఒకవేళ మజ్జిగ పుల్లగా లేకపోతే కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. ఈ మిశ్రమంపై మూత పెట్టి కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల రవ్వ నీటిని పీల్చుకుని మెత్తబడుతుంది.
-10 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి చెక్ చేసుకోండి. పిండి గట్టిపడితే మరికొన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండి మాదిరిగా వచ్చేలా సరిచేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, గుంతల్లో పిండిని నింపాలి.
-ఇడ్లీ కుక్కర్ లేదా పాత్రలో నీళ్లు పోసి వేడి అయ్యాక ఈ ఇడ్లీ స్టాండ్ ను అందులో ఉంచాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 12 నుండి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.
-అంతే ఎంతో రుచికరమైన, దూదిలాంటి మెత్తటి మజ్జిగ ఇడ్లీ రెడీ. దీనిని వేడివేడిగా పల్లి చట్నీ, అల్లం చట్నీ లేదా కారప్పొడితో సర్వ్ చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications