Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
ఇడ్లీ పిండి లేదని టెన్షన్ పడుతున్నారా? అప్పటికప్పుడు చేసుకునే మజ్జిగ ఇడ్లీ రెసిపీ ఇదే!
సాధారణంగా మనం మినపప్పు, బియ్యం రవ్వతో ఇడ్లీలు వేసుకుంటాం. ఇడ్లీలలో గోలీ ఇడ్లీ, ఖుష్బూ ఇడ్లీ, తట్టే ఇడ్లీ, కప్పు ఇడ్లీ, మల్లెపువ్వు లాంటి మృదువైన ఇడ్లీ, రవ్వ ఇడ్లీ.. ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే కొన్నిసార్లు పిండి రుబ్బడం మర్చిపోతాం లేదా అప్పటికప్పుడు ఏదైనా కొత్తగా తినాలనిపిస్తుంది. అలాంటి సమయాల్లో బెస్ట్ ఆప్షన్ మజ్జిగ ఇడ్లీ.
ఈ మజ్జిగ ఇడ్లీ చాలా మృదువుగా, స్పాంజిలా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే..దీనికోసం ముందు రోజు పప్పు నానబెట్టడం, పిండి రుబ్బడం, రాత్రంతా పులియబెట్టడం వంటి పనులేవీ అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉండే పదార్థాలతో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. రుచికరమైన, సులభమైన మజ్జిగ ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ - 2 కప్పులు
అటుకులు - ముప్పావు కప్పు
పుల్లటి మజ్జిగ - 1 కప్పు
వంట సోడా - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి
తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో అటుకులను వేసుకుని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి ఇడ్లీకి మంచి ఆకృతిని, మెత్తదనాన్ని ఇస్తుంది.
-ఒక పెద్ద గిన్నెలో రెండు కప్పుల బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) తీసుకోండి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న అటుకుల పొడిని వేసి కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక కప్పు పుల్లటి మజ్జిగను వేసి బాగా కలపాలి. మజ్జిగ వేయడం వల్ల ఇడ్లీకి మంచి రుచి వస్తుంది. మిశ్రమం గట్టిగా ఉంటే తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండిలా జారుగా కలుపుకోవాలి.
-అందులో రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా వేసి కలపాలి. ఒకవేళ మజ్జిగ పుల్లగా లేకపోతే కొద్దిగా నిమ్మరసం పిండుకోవచ్చు. ఈ మిశ్రమంపై మూత పెట్టి కనీసం 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల రవ్వ నీటిని పీల్చుకుని మెత్తబడుతుంది.
-10 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి చెక్ చేసుకోండి. పిండి గట్టిపడితే మరికొన్ని నీళ్లు పోసి ఇడ్లీ పిండి మాదిరిగా వచ్చేలా సరిచేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి, గుంతల్లో పిండిని నింపాలి.
-ఇడ్లీ కుక్కర్ లేదా పాత్రలో నీళ్లు పోసి వేడి అయ్యాక ఈ ఇడ్లీ స్టాండ్ ను అందులో ఉంచాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి 12 నుండి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి.
-అంతే ఎంతో రుచికరమైన, దూదిలాంటి మెత్తటి మజ్జిగ ఇడ్లీ రెడీ. దీనిని వేడివేడిగా పల్లి చట్నీ, అల్లం చట్నీ లేదా కారప్పొడితో సర్వ్ చేసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





