Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
చుక్క నూనె లేకుండా ఘుమఘుమలాడే పచ్చిమిర్చి ఊరగాయ..తయారీ ఇలా!
భారతీయులకు మరీ ముఖ్యంగా తెలుగువారికి ఊరగాయ లేనిదే ముద్ద దిగదు అనేది అక్షర సత్యం. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఆవకాయ వేసుకుని తిన్నా లేదా ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పూరీ, చపాతీ, పరాఠాలతో నంజుకుని తిన్నా ఆ రుచే వేరు. ఊరగాయలు ఎంత రుచిగా ఉంటాయో, వాటిలో వాడే నూనె వల్ల ఆరోగ్యం పాడవుతుందనే భయం కూడా చాలా మందిలో ఉంటుంది.
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, ఆయిల్ ఫుడ్ తినకూడదనుకునేవారు పాపం తమకిష్టమైన ఊరగాయలకు దూరంగా ఉంటారు. అసలు చుక్క నూనె కూడా వాడకుండా, కేవలం నిమ్మరసం, మసాలా దినుసులతో ఎంతో రుచికరమైన మిరపకాయ ఊరగాయను తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యం, రుచి రెండూ ఇస్తుంది.

కావలసిన పదార్థాలు
పచ్చి మిరపకాయలు- 250 గ్రాములు
నిమ్మకాయలు - 8 నుండి 10
సోంపు గింజలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మెంతులు - 1 టీస్పూన్
పసుపు రంగు ఆవాలు - 2 టీస్పూన్లు
పసుపు - 1 టీస్పూన్
కాశ్మీరీ ఎర్ర కారం - 1 టీస్పూన్ (రంగు కోసం)
నల్ల జీలకర్ర - కొద్దిగా
ఉప్పు, నల్ల ఉప్పు - రుచికి సరిపడా
ఇంగువ - చిటికెడు
తయారీ విధానం
-ముందుగా 250 గ్రాముల మిరపకాయలను తీసుకొని శుభ్రంగా నీటిలో కడగాలి. ఊరగాయ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే తడి అస్సలు ఉండకూడదు.
-కడిగిన మిరపకాయలను ఒక పొడి వస్త్రంతో తుడిచి, గాలికి ఆరబెట్టాలి. తడి ఆరిన తర్వాత వాటి తొడిమలను కత్తిరించాలి. ఇప్పుడు ప్రతి మిరపకాయను మధ్యలోకి నిలువుగా గాటు పెట్టాలి (చీల్చాలి). అయితే మిరపకాయ రెండు ముక్కలుగా విడిపోకుండా, చివర్లు అతుక్కుని ఉండేలా జాగ్రత్తపడండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో సోంపు, జీలకర్ర, మెంతులు మరియు పసుపు ఆవాలు వేసి సన్నని మంటపై దోరగా వేయించండి. మంచి సువాసన వచ్చాక స్టవ్ ఆపేసి, దినుసులను చల్లారనివ్వండి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, కొంచెం బరకగా రుబ్బుకుంటే ఊరగాయ రుచి అద్భుతంగా ఉంటుంది.
-ఒక గిన్నెలో 8-10 నిమ్మకాయల రసాన్ని పిండండి. ఈ రసంలో పసుపు, కశ్మీరీ కారం, సిద్ధం చేసుకున్న మసాలా పొడి, కొద్దిగా నల్ల జీలకర్ర, సాధారణ ఉప్పు వేసి బాగా కలపాలి. రుచిని మరింత పెంచడానికి కొద్దిగా ఇంగువ, నల్ల ఉప్పును కూడా కలపండి. నూనె లేకపోవడం వల్ల ఈ నిమ్మరసమే మిరపకాయలను ఊరేలా చేస్తుంది.
-ఇప్పుడు గాట్లు పెట్టిన పచ్చి మిరపకాయలను ఈ నిమ్మరసం మిశ్రమంలో వేసి బాగా కలపాలి. మసాలా అంతా మిరపకాయల లోపలికి వెళ్లేలా చూడండి.
-ఈ మిశ్రమాన్ని ఒక శుభ్రమైన గాజు సీసాలో భద్రపరచండి.
-ఈ ఊరగాయను వెంటనే తినడం కంటే ఒక 24 గంటల పాటు ఊరనివ్వండి. దీనిని ఫ్రిజ్ లో పెట్టాల్సిన అవసరం లేదు, బయట ఉంచినా పాడవదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications