Latest Updates
-
మే 4: ఈ రాశుల వారికి ఊహించని ధన యోగం.. కెరీర్లో తిరుగులేని సక్సెస్! -
వేడి అన్నంలో చల్లటి బెండకాయ పెరుగు పచ్చడి..ప్రతి ముద్దా ఆహా అనిపించాల్సిందే! -
జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశం.. ఈ రాశుల వారికి నేడు ధన యోగం పక్కా! -
మే నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు? గందరగోళం వద్దు.. పండితులు చెబుతున్న సరైన తేదీ, సమయాలివే! -
మేషరాశిలో బుధ అస్తమయం: ఈ రాశులవారు జాగ్రత్త.. లేదంటే భారీ నష్టాలు తప్పవు! -
వృశ్చికం, సింహం, మీన రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 04 మే 2026 -
కోడిగుడ్డుతో రొటీన్ కూరలు బోర్ కొట్టాయా? అయితే ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ బటర్ మసాలా ట్రై చేయండి! -
జుట్టు రాలడాన్ని తగ్గించి, ఒత్తుగా పెరిగేలా చేసే బయోటిన్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ప్లఫ్ఫీగా, జ్యూసీగా.. ఈ చిల్లీ ఆమ్లెట్ ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు.. -
పెళ్లి వేడుకలకు వరుణుడి గండం! మే నెలలో పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే
Kambu dosa: కంబు దోసె ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్యానికి ఆరోగ్యం,టేస్ట్ కి టేస్ట్..ఎలా చేయాలంటే..
చాలా మంది భారతీయులు ముఖ్యంగా దక్షిణ భారతీయులు దోసె లేకుండా జీవించలేరు. రోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక్కసారైనా దోసె తినడం మనకు అలవాటుగా మారింది. బియ్యప్పిండి దోసె తింటే రుచిగా ఉన్నా..పెద్దగా ప్రయోజనాలేవీ అందించవు. ఇలాంటప్పుడు దోసెను ఆరోగ్యకరమైన ఆహారంగా మార్చాలంటే దానికి కొన్ని గింజలు వేసి దోసె చేయడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. దోసె పిండిలో మిల్లెట్స్ జోడించి దోసెగా మార్చడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ దోసె బరువు తగ్గడం, ఎముకలను బలోపేతం చేయడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఇటీవల కాలంలో మిల్లెట్స్ ని ఎక్కువగా తింటున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత మిల్లెట్స్ కు ప్రాధాన్యం పెరిగింది. కొంత మంది వాటిని అల్పాహారంలా తీసుకుంటుండగా, మరికొందరూ రైస్ బదులు మిల్లెట్స్ నే తీసుకుంటున్నారు. ఎక్కువ మంది అల్పాహారంలా తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. అయితే దోసె రూపంలో వీటిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మిల్లెట్స్ దోసె(దీనినే కంబు దోసె అని కూడా అంటుంటారు)తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-మిల్లెట్స్
-బియ్యం
-మినపప్పు
-తరిగిన ఉల్లిపాయ
-తరిగిన కరివేపాకు
-అల్లం తురుము
-ఉప్పు
-నెయ్యి లేదా ఆయిల్
తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నెలో సమాన మోతాదులో పెరల్ మిల్లెట్స్, బియ్యం
వేసి బాగా కడగాలి. మరొక గిన్నెలో మినపప్పును తీసుకొని బాగా కడగాలి.
ఇప్పుడు ఈ రెండింటి సుమారు నాలుగు గంటలు నానబెట్టండి.
-తర్వాత వీటిని గ్రైండర్ లో వేసి కొన్ని నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు ఈ మెత్తటి పిండిని ఒక గిన్నెలో కలిపేసి ఒక వెచ్చని ప్రదేశంలో పులియబెట్టాలి.
-పులియబెట్టిన పిండిని దోశలు తయారు చేసేందుకు ఉపయోగించాలి. క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలనుకుంటే మరికొన్ని నీరు కలుపుకోండి అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు కలుపుకోండి.
-పిండి బాగా కలిసినప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. పిండిలో ముద్దలు లేకుండా చూసుకోవాలి.
-ఇప్పుడు దోస పెనంను వేడి చేసి నెయ్యితో లేదా నూనెతో అయినా గ్రీజ్ చేసి దోశలు వేసుకోండి. రెండు వైపులా దోశను మంచిగా కాల్చాలి. అంతే మిల్లెట్ దోసె రెడీ. కొబ్బరి చట్నీ లేదా మరేదైనా మీకు నచ్చిన చట్నీతో ఈ దోసెను ఆస్వాదించంవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












