Latest Updates
-
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి!
Kambu dosa: కంబు దోసె ఎప్పుడైనా తిన్నారా? ఆరోగ్యానికి ఆరోగ్యం,టేస్ట్ కి టేస్ట్..ఎలా చేయాలంటే..
చాలా మంది భారతీయులు ముఖ్యంగా దక్షిణ భారతీయులు దోసె లేకుండా జీవించలేరు. రోజూ ఉదయం లేదా సాయంత్రం ఒక్కసారైనా దోసె తినడం మనకు అలవాటుగా మారింది. బియ్యప్పిండి దోసె తింటే రుచిగా ఉన్నా..పెద్దగా ప్రయోజనాలేవీ అందించవు. ఇలాంటప్పుడు దోసెను ఆరోగ్యకరమైన ఆహారంగా మార్చాలంటే దానికి కొన్ని గింజలు వేసి దోసె చేయడం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. దోసె పిండిలో మిల్లెట్స్ జోడించి దోసెగా మార్చడం ఆరోగ్యకరమైన ఎంపిక. ఈ దోసె బరువు తగ్గడం, ఎముకలను బలోపేతం చేయడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఇటీవల కాలంలో మిల్లెట్స్ ని ఎక్కువగా తింటున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత మిల్లెట్స్ కు ప్రాధాన్యం పెరిగింది. కొంత మంది వాటిని అల్పాహారంలా తీసుకుంటుండగా, మరికొందరూ రైస్ బదులు మిల్లెట్స్ నే తీసుకుంటున్నారు. ఎక్కువ మంది అల్పాహారంలా తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. అయితే దోసె రూపంలో వీటిని తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మిల్లెట్స్ దోసె(దీనినే కంబు దోసె అని కూడా అంటుంటారు)తయారీకి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-మిల్లెట్స్
-బియ్యం
-మినపప్పు
-తరిగిన ఉల్లిపాయ
-తరిగిన కరివేపాకు
-అల్లం తురుము
-ఉప్పు
-నెయ్యి లేదా ఆయిల్
తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నెలో సమాన మోతాదులో పెరల్ మిల్లెట్స్, బియ్యం
వేసి బాగా కడగాలి. మరొక గిన్నెలో మినపప్పును తీసుకొని బాగా కడగాలి.
ఇప్పుడు ఈ రెండింటి సుమారు నాలుగు గంటలు నానబెట్టండి.
-తర్వాత వీటిని గ్రైండర్ లో వేసి కొన్ని నీళ్లు పోస్తూ మెత్తగా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు ఈ మెత్తటి పిండిని ఒక గిన్నెలో కలిపేసి ఒక వెచ్చని ప్రదేశంలో పులియబెట్టాలి.
-పులియబెట్టిన పిండిని దోశలు తయారు చేసేందుకు ఉపయోగించాలి. క్రిస్పీగా కాకుండా మెత్తగా కావాలనుకుంటే మరికొన్ని నీరు కలుపుకోండి అలాగే రుచికి తగినట్లుగా ఉప్పు కలుపుకోండి.
-పిండి బాగా కలిసినప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలపాలి. పిండిలో ముద్దలు లేకుండా చూసుకోవాలి.
-ఇప్పుడు దోస పెనంను వేడి చేసి నెయ్యితో లేదా నూనెతో అయినా గ్రీజ్ చేసి దోశలు వేసుకోండి. రెండు వైపులా దోశను మంచిగా కాల్చాలి. అంతే మిల్లెట్ దోసె రెడీ. కొబ్బరి చట్నీ లేదా మరేదైనా మీకు నచ్చిన చట్నీతో ఈ దోసెను ఆస్వాదించంవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












