Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
కనుమ స్పెషల్..చికెన్ కర్రీతో నోట్లో వెన్నలా కరిగిపోయే కొబ్బరి జీలకర్ర దోస
సాధారణంగా మన తెలుగు వారి ఇళ్లలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే గుర్తొచ్చేది ఇడ్లీ లేదా దోస. అందులోనూ దోస అంటే పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. కానీ ప్రతిరోజూ మినప్పప్పు నానబెట్టి, రుబ్బి తయారుచేసే ఆ పాతకాలపు దోసనే తింటూ బోర్ కొట్టిందా? నాలుకకు కొత్త రుచిని పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే ఈసారి కొబ్బరి జీలకర్ర దోస ట్రై చేయండి.
ఈ దోస కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో మనం వాడే కొబ్బరి కమ్మదనాన్ని ఇస్తే, జీలకర్ర జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ కనుమ నాడు దీనిని చికెన్ కర్రీతో గానీ, లేదా సింపుల్ కొబ్బరి చట్నీ, టమోటా చట్నీతో గానీ తింటే ఆ రుచే వేరు. కొబ్బరి జీలకర్ర దోస ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
పచ్చి బియ్యం: 1 కప్పు
పచ్చి కొబ్బరి: అర కప్పు
సాంబార్ ఉల్లిపాయలు: 10
జీలకర్ర: అర టీస్పూన్
ఎండు మిరపకాయలు: 2
కరివేపాకు: 1 రెమ్మ
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: 1 కప్పు
నూనె: దోస కాల్చడానికి
తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు పచ్చి బియ్యాన్ని తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి సుమారు 3 నుండి 4 గంటల పాటు నానబెట్టాలి. బియ్యం ఎంత బాగా నానితే దోస అంత మృదువుగా వస్తుంది.
-నానబెట్టిన బియ్యాన్ని నీరు వంపి మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు అదే మిక్సీ జార్ లో సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, సాంబార్ ఉల్లిపాయలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేయాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి వీటిని కూడా మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. ఈ మసాలానే మన దోసకు అసలైన రుచిని, సువాసనను ఇస్తుంది.
-మిక్సీలో రుబ్బుకున్న కొబ్బరి-మసాలా మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న బియ్యం పిండిలో కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ దోస పిండి చిక్కగా ఉండకూడదు. రవ్వ దోస లేదా నీర్ దోస పిండిలా జారుగా ఉండాలి.
-స్టవ్ మీద దోస పెనం పెట్టి బాగా వేడి చేయండి. పెనం వేడెక్కాక, కొద్దిగా నూనె రాయండి. ఇప్పుడు గరిటతో పిండిని తీసుకుని, రవ్వ దోస వేసినట్లుగా పెనం అంచుల నుండి మధ్యలోకి పోయాలి. సాధారణ దోసలా గరిటతో రుద్దకూడదు.
-దోస చుట్టూ కొద్దిగా నూనె వేసి, పెనంపై మూత పెట్టండి. ఈ దోస ఆవిరిపై ఉడికితేనే రుచి బాగుంటుంది. మీడియం మంటపై కాసేపు ఉడికించిన తర్వాత, మూత తీసి చూడండి. దోస పెనం నుండి విడిపోతున్నట్లు కనిపిస్తే సరిపోతుంది.
-దీనిని తిరగేయాల్సిన అవసరం లేదు. అంతే వేడి వేడి, గుమగుమలాడే కొబ్బరి జీలకర్ర దోస రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications