Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
కశ్మీరీ స్టైల్ ఫిష్ ఫ్రై.. టేస్ట్ వేరే లెవల్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు
నాన్ వెజ్ లో చేపలకు ఉండే క్రేజ్ వేరు. చికెన్, మటన్ తినడానికి ఇష్టపడని వారు సైతం, చేపల వంటకాలను లొట్టలేసుకుంటూ తింటారు. దానికి ప్రధాన కారణం చేపల్లో ఉండే ప్రత్యేకమైన రుచి,సువాసన. సాధారణంగా మనం చేపలను ఇంటికి తెచ్చుకోగానే పులుసు లేదా మన సంప్రదాయ పద్ధతిలో మసాలాలు దట్టించి ఫ్రై చేస్తుంటాం.
కానీ ప్రతీసారీ ఒకే రుచిని ఆస్వాదించడం బోర్ కొడుతోంది కదా? అందుకే రెగ్యులర్ ఫిష్ ఫ్రైకి బదులుగా, నోరూరించే కశ్మీరీ స్టైల్ ఫిష్ ఫ్రైని ప్రయత్నించండి. మీరు ఇప్పటివరకు తిన్న చేపల వేపుడు వేరు.. ఈ కశ్మీరీ స్టైల్ వేరు. దీని రుచి వేరే లెవల్ లో ఉంటుంది. కశ్మీరీ స్టైల్ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
చేప ముక్కలు - 1 కిలో
పసుపు - 1 టీస్పూన్
సాధారణ కారం - 2 టీస్పూన్లు
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
సోంపు పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
జీలకర్ర పొడి - ఒకటిన్నర టీస్పూన్లు
గరం మసాలా - 1 టీస్పూన్
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు -సరిపడా
నూనె -సరిపడా
తయారీ విధానం
-ముందుగా చేప ముక్కలను పసుపు, ఉప్పు వేసి నీటితో రెండు, మూడు సార్లు శుభ్రంగా కడగాలి. దీనివల్ల చేపల నీచు వాసన పోతుంది.
-ఒక వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో పసుపు, సాధారణ కారం, కాశ్మీరీ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోంపు పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, బియ్యం పిండిని వేసి కలపండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లి, మిశ్రమాన్ని చిక్కటి పేస్ట్ లా తయారు చేసుకోండి.
-ఇప్పుడు శుభ్రం చేసిన చేప ముక్కలకు ఈ మసాలా పేస్ట్ ను అన్ని వైపులా బాగా పట్టించండి. మసాలా దట్టించిన చేపలను కనీసం 45 నిమిషాల నుండి 1 గంట పాటు పక్కన పెట్టండి. ఫ్రిజ్ లో పెడితే మసాలా ముక్కల లోపలికి బాగా ఇంకి రుచి అద్భుతంగా ఉంటుంది.
-తర్వాత స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం కడాయి పెట్టి నూనె వేడి చేయండి. నూనె వేడెక్కిన తర్వాత మంటను మీడియంలో పెట్టి చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేయండి.
-చేపలు వేగుతున్నప్పుడు వాటిపై కొద్దిగా కాశ్మీరీ కారం పొడి, సోంపు పొడిని చిలకరించండి. ఇది ఈ వంటకం అసలైన సీక్రెట్. దీనివల్ల మంచి సువాసన వస్తుంది.
-ముక్కలు రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు బయట కరకరలాడుతూ, లోపల జ్యూసీగా, మృదువుగా ఉడుకుతాయి.
-అంతే వేడి వేడి కాశ్మీరీ ఫిష్ ఫ్రై రెడీ. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications