Latest Updates
-
రెస్టారెంట్ రుచిని మైమరిపించే దహీ మటన్..ఇలా వండితే ముక్క వెన్నలా కరిగిపోవాల్సిందే! -
చాణక్య నీతి: SRH vs RR మ్యాచ్లో దాగున్న సక్సెస్ రహస్యాలివే -
పప్పు నానబెట్టే పనే లేదు..రాత్రి మిగిలిన అన్నంతో 10 నిమిషాల్లో దూదిలాంటి స్పాంజీ ఇడ్లీలు! -
ఎండాకాలంలో పచ్చి ఉల్లిపాయ.. ఈ లాభాలు తెలిస్తే రోజూ వదిలిపెట్టరు! -
ఎండల వేడిని తట్టుకోవాలా? ఈ చలవ చేసే ఆహారాలు మీకోసం! -
ఐరన్, కాల్షియంల గని..మాస్టర్ చెఫ్ స్టైల్ మునగకాయ నిల్వ పచ్చడి..అమృతం టేస్ట్ అందే ఇదేనేమో! -
మేష సంక్రాంతి వేళ ఈ పండుగలు ఎందుకు ప్రత్యేకం? ఆచారాల వెనుక ఉన్న అసలు రహస్యాలివే -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత యోగం..! - సోమవారం, 13 ఏప్రిల్ 2026 -
16 ఏళ్లుగా విడిపోయినా వదలని బంధం.. భర్తకు సుప్రీంకోర్టు షాకింగ్ ఆదేశాలు! -
ఏప్రిల్ ఎండలు మండిపోతున్నాయా? ఈ చిట్కాలతో వడదెబ్బకు చెక్ పెట్టండి
మామిడిపండ్లు తిన్న ఎన్ని నిమిషాల తర్వాత నీళ్లు తాగాలి?
ఎండాకాలంలో ఎక్కడ చూసినా నోరూరించే మామిడి పండ్ల గుమగుమలే కనిపిస్తాయి. మార్కెట్లు, పండ్ల దుకాణాలు, వీధి బండ్లు.. ఇలా ఎక్కడ చూసినా పసుపు పచ్చని మామిడి పండ్ల సందడే. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ పండును ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు.
అయితే మామిడిపండు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు అని మన ఇంట్లో పెద్దలు చెప్పడం మనం తరచుగా వింటుంటాం. నేటి తరంలో కొందరు దీన్ని కేవలం ఒక మూఢనమ్మకంగా కొట్టిపారేస్తుంటారు. కానీ ఆయుర్వేదం,మోడ్రన్ సైన్స్ ఈ విషయం గురించి ఏం చెబుతున్నాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
జీర్ణక్రియపై చల్లటి నీటి ప్రభావం
ఆయుర్వేదం ప్రకారం మామిడిపండును శరీరంలో ఉష్ణాన్ని (వేడిని) పెంచే
పండుగా పరిగణిస్తారు. మామిడిపండులో సహజమైన తీపి, పీచుపదార్థాలు
(ఫైబర్), ఎన్నో రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. వీటన్నింటినీ
అరిగించుకోవడానికి మన జీర్ణవ్యవస్థ కాస్త ఎక్కువ కష్టపడాల్సి
ఉంటుంది.
మామిడిపండు తినగానే కడుపులో దాన్ని జీర్ణం చేసే ప్రక్రియ వేగంగా మొదలవుతుంది. ఆ సమయంలో ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. సరిగ్గా అటువంటి పరిస్థితుల్లో మనం వెంటనే చల్లటి నీళ్లు తాగితే, అది కడుపులోని వేడిని అమాంతం తగ్గించేసి జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది.
వెంటనే నీళ్లు తాగితే వచ్చే సమస్యలు
జీర్ణక్రియ నెమ్మదించడం వల్ల మనం తిన్న మామిడిపండు సరిగ్గా జీర్ణం
కాదు. దీని ఫలితంగా కడుపులో గ్యాస్ ఏర్పడటం, పుల్లటి త్రేన్పులు
రావడం, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లేదా కడుపులో ఒకరకమైన బరువుగా అనిపించడం
వంటి జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి.
మరి నీళ్లు ఎప్పుడు తాగాలి?
మామిడి పండు తిన్న తర్వాత కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు వ్యవధి
ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ లోపు శరీరం జీర్ణప్రక్రియను ఒక
కొలిక్కి తీసుకువస్తుంది. ఆ తర్వాత నీళ్లు తాగినా ఎలాంటి
దుష్ప్రభావాలు ఉండవు. ఒకవేళ పండు తిన్న వెంటనే మీకు విపరీతంగా దాహం
వేస్తే, ఫ్రిజ్లోని ఐస్ నీటికి బదులుగా గోరువెచ్చని నీరు లేదా
నార్మల్ వాటర్ కొద్దిగా తాగడం ఉత్తమం.
మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం ఎందుకు?
పాత కాలంలో మన అమ్మమ్మలు, నాయనమ్మలు మామిడిపండ్లను తినడానికి ఇచ్చే
ముందు, వాటిని కాసేపు బకెట్ నీళ్లలో నానబెట్టేవారు. దీని వెనుక
అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. మామిడిపండ్లను నీటిలో నానబెట్టడం వల్ల
వాటిపై ఉన్న బాహ్య వేడి తొలగిపోయి, శక్తి సమతుల్యం అవుతుంది.
అంతకంటే ముఖ్యంగా, పండ్లలో సహజంగా ఉండే ఫైటిక్ యాసిడ్ అనే రసాయనం నీటిలో నానబెట్టడం వల్ల బయటకు వెళ్లిపోతుంది. ఈ ఫైటిక్ యాసిడ్ శరీరంలో వేడిని, చర్మంపై దద్దుర్లను కలగజేస్తుంది. నీటిలో నానిన మామిడిపండ్లు త్వరగా, సులభంగా జీర్ణమై మన ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయవు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











