Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
పప్పు నానబెట్టే పనే లేదు..రాత్రి మిగిలిన అన్నంతో 10 నిమిషాల్లో దూదిలాంటి స్పాంజీ ఇడ్లీలు!
మన ఇళ్లలో తరచుగా వండిన అన్నం మిగిలిపోవడం చాలా సహజం. అలాంటప్పుడు ఆ అన్నాన్ని పారేయడానికి మనసు రాదు, అలా అని చల్లారిన అన్నాన్ని తినడానికీ ఇష్టపడం. మరి ఆ మిగిలిపోయిన అన్నంతో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మల్లెపూవుల్లాంటి మెత్తటి ఇడ్లీలు తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా?
సాధారణంగా ఇడ్లీలు చేయాలంటే పప్పు నానబెట్టాలి, రుబ్బాలి, రాత్రంతా పులియబెట్టాలి.. ఇదంతా పెద్ద తతంగం. కానీ ఈ పద్ధతిలో గంటల తరబడి పులియబెట్టాల్సిన పనే లేదు. అప్పటికప్పుడు నిమిషాల్లో వేడివేడి, దూది లాంటి స్పాంజీ ఇడ్లీలను మీ కుటుంబ సభ్యులకు వడ్డించవచ్చు.

మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
మిగిలిపోయిన అన్నం - 1 కప్పు
బొంబాయి రవ్వ- అర కప్పు
తాజా పెరుగు - అర కప్పు
నీళ్లు - సరిపడా
ఉప్పు - మీ రుచికి తగినంత
వంట సోడా - అర టీస్పూన్
వంటనూనె - కొద్దిగా
మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మిగిలిపోయిన అన్నాన్ని వేయండి. దానికి కొద్దిగా నీళ్లు జతచేసి, ఎక్కడా ఉండలు లేకుండా చాలా మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-ఇప్పుడు ఈ మెత్తటి అన్నం పేస్ట్ను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోండి. అందులో ముందుగా తీసుకున్న అర కప్పు బొంబాయి రవ్వ, అర కప్పు పెరుగు వేసి అన్నీ బాగా కలిసేలా గరిటతో కలుపుకోవాలి.
-పిండి మరీ చిక్కగా అనిపిస్తే, సాధారణ ఇడ్లీ పిండి ఏ చిక్కదనంతో ఉంటుందో చూసుకుని, దానికి తగ్గట్లుగా కొద్దిగా నీళ్లు కలపండి. మీరు పిండి కలుపుకునేటప్పుడు కొద్దిగా అటుకులు పొడి చేసి కలిపితే ఇడ్లీలు మరింత మృదువుగా, స్పాంజీలా వస్తాయి.
-ఇప్పుడు పిండిలో మీ రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల బొంబాయి రవ్వ నీటిని, పెరుగును పీల్చుకుని చక్కగా నానుతుంది.
-ఇడ్లీలు వేయడానికి సరిగ్గా ముందు, పిండిలో బేకింగ్ సోడా లేదా ఈనో వేసి ఒకే దిశలో సున్నితంగా కలపండి. పిండి బుడగల్లా పొంగుతూ తేలికగా మారుతుంది.
-ఇడ్లీ అచ్చులకు (ప్లేట్లకు) కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి, ఈ పిండిని కొద్దికొద్దిగా అందులో పోయండి.
-ఇడ్లీ పాత్రలో లేదా స్టీమర్ లో కొద్దిగా నీళ్లు పోసి, ఈ ప్లేట్లను పెట్టి మూతపెట్టండి. మీడియం మంట మీద సుమారు 10 నుంచి 12 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, వేడి మీద వెంటనే తీయకుండా ఒక రెండు నిమిషాలు ఆగి ఇడ్లీలను గరిటతో బయటకు తీయండి.
-అంతే వేడివేడి ఇడ్లీలు రెడీ. వీటిని కమ్మటి కొబ్బరి పల్లి చట్నీ లేదా వేడివేడి సాంబార్ తో తింటుంటే ఆహా అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications