Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
ప్రసాదం దద్దోజనం..ఆరోగ్యానికి ఆరోగ్యం,రుచికి రుచి..ఇంట్లోనే ఇలా చేసుకోండి
సాధారణంగా పండుగలప్పుడు నైవేధ్యంగా,ఇంట్లో శుభకార్యాలకు లేదా దేవాలయాల్లో ప్రసాదంగా ఎక్కువగా దద్యోధనం పెడతారు. దీనిని దద్దోజనం అని కూడా పిలుస్తారు. వండిన అన్నం, పెరుగు, పోపు దినుసులతో దీనిని తయారుచేస్తారు. దీనిని తరచుగా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రసాదంగా అందిస్తారు. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి ఘాటైన మసాలాలు అవసరం లేదు, దీనిలోని సాత్విక గుణం,తేలికపాటి రుచి దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. దీనిని తయారుచేయడం చాలా సులభం..పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ప్రసాదం దద్దోజనం మీ ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ప్రసాదం దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-నీళ్లు
-సొంఠి పొడి
-నెయ్యి
-ఆవాలు
-జీలకర్ర
-మిరియాలు
-మినపప్పు
-పచ్చి శెనగపప్పు
-పచ్చిమిరపకాయ
-ఎండు మిరపకాయ
-అల్లం తరుగు
-పాలు
-పెరుగు
-ఉప్పు
-కొత్తిమీర
-కరివేపాకు
ప్రసాదం దద్దోజనం ఇంట్లోనే తయారీ విధానం
ముందుగా ముప్పావు కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టండి.
నానిన బియ్యాన్ని కుక్కర్ లో వేసి 750 ml నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంటమీద 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికించాలని గుర్తుపెట్టుకోండి.
తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేసి అందులో అర ఇంచు సొంఠి వేసి ఎర్రబడేదాకా మీడియం మంటమీద వేయించి తీసేసి దానిని మెత్తని పొడిగా అయ్యేలా దంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి అందులో 1 టీస్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనిచ్చాక 1 టీస్పూన్ జీలకర్ర, ముప్పావు టీస్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి వేపుకోండి. దాదాపుగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, 2 ఎండుమిర్చి ముక్కలు, కారం తక్కువగా ఉండే 1 పచ్చిమిరపకాయ సన్నని ముక్కలు, అర టీస్పూన్ అల్లం తరుగు వేసి వేపుకోండి.
ఇప్పుడు మెత్తగా వండిన అన్నంలో ఉప్పు వేసి కలిపి తర్వాత అర లీటరు పెరుగు, పావు లీటరు కాచి చల్లార్చిన పాలు, తాళింపు, 1 టీస్పూన్ సొంఠి పొడి వేసి బాగా కలిపి మళ్లీ పావు లీటరు కాచి చల్లార్చిన పాలు పోసి కలిపాక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసి కలుకోండి. కొద్దిగ సమయం తర్వాత దీన్ని తీసుకొని తింటే ఆహా అని తీరాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications











