Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ప్రసాదం దద్దోజనం..ఆరోగ్యానికి ఆరోగ్యం,రుచికి రుచి..ఇంట్లోనే ఇలా చేసుకోండి
సాధారణంగా పండుగలప్పుడు నైవేధ్యంగా,ఇంట్లో శుభకార్యాలకు లేదా దేవాలయాల్లో ప్రసాదంగా ఎక్కువగా దద్యోధనం పెడతారు. దీనిని దద్దోజనం అని కూడా పిలుస్తారు. వండిన అన్నం, పెరుగు, పోపు దినుసులతో దీనిని తయారుచేస్తారు. దీనిని తరచుగా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రసాదంగా అందిస్తారు. దీనికి ప్రత్యేకంగా ఎటువంటి ఘాటైన మసాలాలు అవసరం లేదు, దీనిలోని సాత్విక గుణం,తేలికపాటి రుచి దీనిని మరింత ప్రత్యేకంగా చేస్తాయి. దీనిని తయారుచేయడం చాలా సులభం..పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ప్రసాదం దద్దోజనం మీ ఇంట్లోనే తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.
ప్రసాదం దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-నీళ్లు
-సొంఠి పొడి
-నెయ్యి
-ఆవాలు
-జీలకర్ర
-మిరియాలు
-మినపప్పు
-పచ్చి శెనగపప్పు
-పచ్చిమిరపకాయ
-ఎండు మిరపకాయ
-అల్లం తరుగు
-పాలు
-పెరుగు
-ఉప్పు
-కొత్తిమీర
-కరివేపాకు

ప్రసాదం దద్దోజనం ఇంట్లోనే తయారీ విధానం
ముందుగా ముప్పావు కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టండి.
నానిన బియ్యాన్ని కుక్కర్ లో వేసి 750 ml నీళ్లు పోసి మూతపెట్టి మీడియం మంటమీద 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికించాలని గుర్తుపెట్టుకోండి.
తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేసి అందులో అర ఇంచు సొంఠి వేసి ఎర్రబడేదాకా మీడియం మంటమీద వేయించి తీసేసి దానిని మెత్తని పొడిగా అయ్యేలా దంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి అందులో 1 టీస్పూన్ ఆవాలు వేసి చిటపటలాడనిచ్చాక 1 టీస్పూన్ జీలకర్ర, ముప్పావు టీస్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు వేసి వేపుకోండి. దాదాపుగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, 2 ఎండుమిర్చి ముక్కలు, కారం తక్కువగా ఉండే 1 పచ్చిమిరపకాయ సన్నని ముక్కలు, అర టీస్పూన్ అల్లం తరుగు వేసి వేపుకోండి.
ఇప్పుడు మెత్తగా వండిన అన్నంలో ఉప్పు వేసి కలిపి తర్వాత అర లీటరు పెరుగు, పావు లీటరు కాచి చల్లార్చిన పాలు, తాళింపు, 1 టీస్పూన్ సొంఠి పొడి వేసి బాగా కలిపి మళ్లీ పావు లీటరు కాచి చల్లార్చిన పాలు పోసి కలిపాక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసి కలుకోండి. కొద్దిగ సమయం తర్వాత దీన్ని తీసుకొని తింటే ఆహా అని తీరాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications