Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Milk Mysore Pak: మిల్క్ మైసూర్ పాక్..చేసుకోవడం వెరీ సింపుల్..నోట్లో వెన్నలా కరిగిపోతుంది
స్వీట్స్ అంటే ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. అయితే ఎన్ని రకాల స్వీట్లు ఉన్నా అందులో మైసూర్ పాక్ కి స్పెషల్ ప్లేస్ ఉంటుంది. మైసూర్ పాక్ లో కూడా రకాలు ఉంటాయి. అందులో ఒకటి మిల్క్ మైసూర్ పాక్(milk mysore pak). ఒక్క ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే మిల్క్ మైసూర్ పాక్ ని చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. స్వీట్ షాపులో అమ్మే మిల్క్ మైసూర్ పాక్ కన్నా టేస్టీగా ఉండేలా దీన్ని ఎలా చేసుకోవాలి, మిల్క్ మైసూర్ పాక్ తయారీకి ఏయే పదార్థాలు కావాలో ఇప్పుడు చూద్దాం.
మిల్క్ మైసూర్ పాక్ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-మిల్క్ పౌడర్
-చక్కెర
-నెయ్యి
-మైదా
-నిమ్మరసం

మిల్క్ మైసూర్ పాక్ తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద ప్లేట్ తీసుకొని అందులో 200 గ్రాముల మిల్క్ పౌడర్ లేదా పాల పిండి,2 టీ స్పూన్ల మైదా,2 టీ స్పూన్ల నెయ్యి వేసి బాగా బ్రెడ్ పొడిలా కలిపి పక్కనపెట్టుకోండి.
-ఇఫ్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 800 గ్రాముల చక్కెర పోసి అందులో 200 గ్రాముల నీళ్లు పోసి ఓ తీగ పాకం వచ్చేదాకా వేడి చేయాలి.
-ఓ తీగ పాకం వచ్చాక అందులో పావు టీ స్పూన్ నిమ్మరసం అందులో వేసి బాగా కలపండి.
-ఇప్పుడు మంటను మీడియంలో పెట్టి కలిపి ఉంచుకున్న పాలపిండి మిశ్రమాన్ని పంచదార పాకంలో పోసి గడ్డలు లేకుండా బాగా కలపాలి.
-ఇప్పుడు 200 గ్రాముల నెయ్యిని కొంచెం కొంచెంగా అందులో పోస్తూ కలపాలి.
-20 నిమిషాల తర్వాత ఆ పాకం రంగు మారడం ప్రారంభమవుతుంది. లోపలి నుంచి బబుల్స్ లా వస్తుంటాయి.
-ఇప్పుడు అది రెడీ అయిందా లేదా అన్నది తెలుసుకోడానికి పాకాన్ని కొంచెం చేతిలోకి తీసుకొని నలిపితే ఉండ కడితే అప్పుడు అది ఫర్ఫెక్ట్ గా అయినట్లు భావించవచ్చు.
-ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులో 50 గ్రాముల నెయ్యి పోసి బాగా కలపండి.
-ఇప్పుడు నెయ్యి రాసి ఉంచిన ట్రేలో చక్కెర పాకం మిశ్రమాన్ని మొత్తం పోసి ఒక 4-5 గంటలు చల్లారనివ్వండి.
-5 గంటల తర్వాత దాన్ని ఓ ప్లేట్ లో వేసి ముక్కలుగా కట్ చేసుకోండి. టేస్టీ మిల్క్ మైసూర్ పాక్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications