Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
మినుములతో ఇలా చేసుకొని తింటే..1000 ఏనుగుల బలం!
భారతీయ వంటిల్లు ఒక వైద్యశాల అయితే, అందులో ఉండే దినుసులు ఔషధాలు. అందులోనూ తెలుగు వారి సంప్రదాయంలో మినుములుకు ప్రత్యేక స్థానం ఉంది. పూర్వకాలంలో మన అమ్మమ్మలు, నానమ్మలు పిల్లల ఎదుగుదలకు, ముఖ్యంగా ఆడపిల్లల ఆరోగ్యానికి మినుముల పాయసం చేసి పెట్టేవారు.
ఈ రోజుల్లో పిజ్జాలు, బర్గర్ల మోజులో పడి ఇలాంటి బలవర్ధకమైన ఆహారాన్ని మనం మర్చిపోతున్నాం. శరీరాన్ని ఉక్కులా మార్చే శక్తి మినుములకు ఉంది. ఎంత నీరసంగమైన మనిషి కూడా మినుముల పాయసం రోజు ఒక కప్పు తాగితే వెంటనే లేచి ఉరకడం ఖాయం. అంత బలం ఇస్తుంది. మినుముల పాయసం మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
మినుముల పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినుములు
-బియ్యం
-బెల్లం
-పచ్చి కొబ్బరి తురుము
-బాదం
-జీడిపప్పు
మినుముల పాయసం తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద లేదా పొయ్యి మీద బాండీ పెట్టి అందులో 1 కప్పు మినుములు వేసి సన్నని మంటపై దోరగా వేయించుకోవాలి. మినుముల నుంచి మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. తర్వాత అందులోనే 1 చెంచా బియ్యం వేసి(దించే ముందే బియ్యం వేసుకోవాలి లేకుంటే మాడిపోతాయి)వేయించుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి.
-వేయించిన మినుములు,బియ్యం చల్లారిన తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
-ఒక గిన్నెలో గ్రైండ్ చేసుకున్న పొడి వేసి,ఇందులోనే ఒక కప్పు నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోండి.
-తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో మూడు కప్పుల నీళ్లు పోపి వేడి చెయ్యాలి. వెడెక్కిన నీళ్లలో కలిపి ఉంచిన పిండి మిశ్రమం వేసి కలుపుకోవాలి. టక టక అనేదాకా కలుపుతూ ఉడికించాలి. చేత్తో పట్టుకుంటే మెత్తగా కరిగిపోతుండాలి.
-దగ్గర పడి ఉడికినప్పుడు అందులో ఒక కప్పు బెల్లం వేసి 2-3 నిమిషాలు ఉడికించాలి. తర్వాత అందులో రుచికి తగినట్లు పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుకున్నాక అందులోనే సన్నగా కట్ చేసిన బాదం,జీడిపప్పు కూడా వేసుకొని కలుపుకొని 1 నిమిసం తర్వాత స్టవ్ ఆపేయండి. అంతే మినుముల పాయసం రెడీ.
-వారానికి కనీసం ఒక్కసారైనా ఈ పాయసాన్ని బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం స్నాక్ గా తీసుకోవడం వల్ల కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







