ఎలాంటి మెషీన్ లేకుండానే ఇంట్లోనే స్వచ్ఛమైన వేరుశెనగ నూనె..ఎలా చేయాలో చూడండి..

Posted By:

వంటలకు, ముఖ్యంగా డీప్‌ ఫ్రై చేయడానికి వేరుశెనగ నూనె (పల్లీ నూనె) బెస్ట్ అని మనందరికీ తెలుసు. అందులోనూ గానుగ నూనె వాడటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే మార్కెట్లో స్వచ్ఛమైన గానుగ నూనె దొరకడం కష్టంగా మారిన ఈ రోజుల్లో ఎలాంటి మెషీన్ అవసరం లేకుండానే ఇంట్లో ఉండే మిక్సీతో స్వచ్ఛమైన పల్లీ నూనెను సులభంగా తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును, కేవలం 1 కిలో వేరుశెనగ గుళ్లతో ఏకంగా 400 గ్రాముల కల్తీలేని నూనెను మన చేతులతోనే తీసుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి.

No Machine Needed How To Make Fresh Pure Groundnut Oil at Home in Telugu Mind Blowing Kitchen Hack

వేరుశెనగ నూనె తయారీకి కావాల్సినవి

వేరుశెనగ గుళ్లు - 1 కిలో
వేడి నీళ్లు - తగినంత

మైదా,చక్కెర లేకుండా ఆరోగ్యకరమైన రాగి బూరెలు.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే!

వేరుశెనగ నూనె తయారీ విధానం

-ముందుగా ఒక మందపాటి కడాయిలో ఎలాంటి నూనె వేయకుండా ఒక కిలో వేరుశెనగ గుళ్ళను దోరగా వేయించాలి. సన్నని మంట మీద గుళ్లపై ఉండే పొట్టు చిటపటలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి కొద్దిగా చల్లారాక, చేతులతో రుద్ది కానీ, లేదా ఒక కాటన్ వస్త్రంలో వేసి బాగా నలిపి కానీ పొట్టు తీసేయాలి. ఆ తర్వాత చాటలో చెరిగి పొట్టును పూర్తిగా వేరు చేయాలి.

-పొట్టు తీసిన పల్లీలను మిక్సీ జార్‌ లో సగం వరకు వేసి గ్రైండ్ చేయాలి. ఒకేసారి కాకుండా మిక్సీని ఆన్, ఆఫ్ చేస్తూ పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత హై స్పీడ్ మీద మెత్తగా రుబ్బాలి. ఇలా చేస్తున్నప్పుడు పల్లీల నుండి సహజంగానే కొద్దిగా నూనె బయటకు రావడం మీరు గమనించవచ్చు. మొత్తం కిలో పల్లీలను ఇదే విధంగా గ్రైండ్ చేసి ఒక పెద్ద వెడల్పాటి పళ్లెంలోకి తీసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించి స్టవ్ ఆపేయాలి.

-మరిగించి పెట్టుకున్న వేడి నీళ్లను పల్లీల మిశ్రమంలో కొద్దికొద్దిగా (రెండు స్పూన్ల చొప్పున) పోస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి. నీళ్లు ఒకేసారి ఎక్కువ పోయకూడదు. వేడి నీళ్లు తగిలి పల్లీలు నూనెను వదలడం ప్రారంభిస్తాయి. రెండు చేతులతో గట్టిగా చపాతీ పిండిలా పిసుకుతూ ఉంటే కొద్దిసేపటికి నూనె బయటకు రావడం మీరే చూస్తారు.

-బయటకు వచ్చిన నూనెను ఒక సన్నని పలుచటి వస్త్రంలో కానీ, జల్లెడలో కానీ వేసి గట్టిగా పిండాలి. మిగిలిన పిండి ముద్దలో మళ్లీ కొద్దిగా వేడి నీళ్లు చల్లి గట్టిగా పిసుకుతూ మిగిలిన నూనెను కూడా తీయాలి. ఇలా చేయడం వల్ల దాదాపు 300 నుండి 400 గ్రాముల స్వచ్ఛమైన, కమ్మని వేరుశెనగ నూనె మీ ఇంట్లోనే రెడీ అవుతుంది.

-నూనె తీసేయగా మిగిలిన పల్లీల పిండిని పడేయాల్సిన అవసరం లేదు. అందులో పోషకాలు అలాగే ఉంటాయి. ఈ పిండిలో తగినంత తరిగిన బెల్లం లేదా పంచదార వేసి, కొద్దిగా వేయించిన నువ్వులు, యాలకుల పొడి కలిపి రుచికరమైన పల్లీ లడ్డూలు లేదా బర్ఫీలు తయారు చేసుకోవచ్చు.

[ of 5 - Users]
Story first published: Sunday, August 2, 2026, 7:55 [IST]
Desktop Bottom Promotion