Latest Updates
-
అందరూ మిమ్మల్నే ఇష్టపడాలా? మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే సైకలాజికల్ సీక్రెట్స్! -
నోరూరించే కమ్మని మామిడికాయ పప్పు.. రుచికి అమృతం కూడా సాటిరాదు! -
ఎండ వేడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ పానీయాలతో వడదెబ్బకు చెక్ పెట్టండి -
మంచు శివలింగ దర్శనానికి వేళాయె..నేటి నుంచే అమర్నాథ్ యాత్ర-2026 రిజిస్ట్రేషన్లు..ఫుల్ డీటెయిల్స్ మీకోసం.. -
ఐపీఎల్ మ్యాచ్లోని ఈ వ్యూహాలు తెలిస్తే మీ కెరీర్ మలుపు తిరుగుతుంది -
అసలు సిసలైన అమ్మమ్మల నాటి రాగి అంబలి..వేసవి తాపాన్ని ఇట్టే తరిమికొట్టే అమృతం..ఇలా చేసుకోండి! -
సైలెంట్ కిల్లర్స్ గుప్పిట్లో తెలంగాణ..హైదరాబాద్ లో భారీగా ఊబకాయం కేసులు.. వరంగల్ లో హైబీపీ! -
10 నిమిషాల్లో అదిరిపోయే ఆంధ్రా మామిడికాయ తురుము పచ్చడి.. వేడి అన్నంలోకి అమృతం! -
40 డిగ్రీల ఎండలు: డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే ఇవి తప్పనిసరి! -
విషు, పొయిలా బైశాఖ్ వేడుకల్లో ఈ తప్పులు చేస్తున్నారా? అదృష్టం కలిసి రావాలంటే ఇవి పాటించండి!
పప్పు నానబెట్టకుండా,రుబ్బకుండా..అప్పటికప్పుడు నోట్లో కరిగిపోయే రవ్వ పెరుగు ఇడ్లీ..ఎలా చేసుకోవాలో చూడండి
సాంప్రదాయ పద్ధతిలో ఇడ్లీ చేయాలంటే.. ముందురోజు బియ్యం, మినపపప్పు నానబెట్టాలి, ఆ తర్వాత గ్రైండర్లో రుబ్బాలి, రాత్రంతా పులియబెట్టాలి. ఉరుకుల పరుగుల జీవితంలో అంత సమయం, ఓపిక లేని వారు ఇన్ స్టంట్ రవ్వ పెరుగు ఇడ్లీ ట్రై చేయండి.
ఎలాంటి నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు బొంబాయి రవ్వ, పెరుగు కాంబినేషన్ తో చేసే ఇడ్లీలు అచ్చం హోటల్ స్టైల్ లో స్పాంజ్ లా మెత్తగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి.
రవ్వ పెరుగు ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ (సూజీ) - 2 కప్పులు
పుల్లటి పెరుగు - ఒకటిన్నర కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పు
ఈనో పౌడర్ లేదా బేకింగ్ సోడా - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నెయ్యి లేదా నూనె - ఇడ్లీ ప్లేట్లకు రాయడానికి
రవ్వ పెరుగు ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పుల బొంబాయి రవ్వ వేయండి. మంటను సిమ్ లో ఉంచి రవ్వ రంగు మారకుండా కేవలం పచ్చివాసన పోయేలా 2 నిమిషాల పాటు వేయించండి. వేయించిన రవ్వను ఒక గిన్నెలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి.
-రవ్వ చల్లారిన తర్వాత అందులో ఒకటిన్నర కప్పు పుల్లటి పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమం సాధారణ ఇడ్లీ పిండిలా ఉండాలి, మరీ నీళ్లలా లేదా మరీ గట్టిగా ఉండకూడదు. రవ్వ నీటిని పీల్చుకుని ఉబ్బుతుంది కాబట్టి పిండిపై మూతపెట్టి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
-20 నిమిషాల తర్వాత పిండి కాస్త గట్టిపడితే కొద్దిగా నీళ్లు కలపండి. ఇడ్లీలు అచ్చుల్లో వేయడానికి సరిగ్గా ముందు.. పిండిలో 1 టీస్పూన్ ఈనో లేదా బేకింగ్ సోడా వేసి, దానిపై ఒక టీస్పూన్ నీరు పోయండి. అది బుడగల్లా రాగానే పిండిని సున్నితంగా ఒకే దిశలో కలపాలి. ఈనో వేసిన తర్వాత పిండిని అతిగా లేదా వేగంగా కలపకూడదు, అలా చేస్తే ఇడ్లీలు గట్టిగా వస్తాయి.
-ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, ఈ పిండిని అచ్చుల్లో పోయండి. ఇడ్లీ పాత్రలో నీళ్లు మరిగించి, ఈ ప్లేట్లను అందులో పెట్టి మీడియం మంటపై 10-12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించండి. ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి, వెంటనే కాకుండా ఓ 2-3 నిమిషాలు ఆగి ఇడ్లీలను బయటకు తీయండి.
-ఈ ఇడ్లీలకు మరింత రుచిని జోడించాలనుకుంటే.. ఒక చిన్న కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి తాలింపు పెట్టుకుని పిండిలో కలుపుకోవచ్చు.
-అంతే గుమగుమలాడే, మృదువైన ఇన్ స్టంట్ రవ్వ పెరుగు ఇడ్లీలు రెడీ. వేడివేడి ఇడ్లీలను కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీతో తింటుంటే అదిరిపోతుందంతే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
