Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
హోటల్ స్టైల్ పరోఠా షేర్వా..రుచి చూస్తే వదిలిపెట్టరు
వేడి వేడి పొరల పరోఠాను, స్పైసీగా ఉండే పలచటి షేర్వాలో ముంచుకుని తింటే ఆ రుచే వేరు. సాధారణంగా ఇంట్లో చేసే కుర్మా చిక్కగా ఉంటుంది, కానీ హోటల్స్ లో ఇచ్చే షేర్వా పలచగా, ఘాటుగా, విభిన్నమైన రుచిని కలిగి ఉంటుంది.
చాలామందికి హోటల్ స్టైయిల్ షేర్వా రుచి ఇంట్లో ఎందుకు రాదు అనే సందేహం ఉంటుంది. దానికి ప్రధాన కారణం అందులో వాడే మసాలా దినుసులు, తయారీ విధానం. హోటల్ స్టైల్ వెజ్ షేర్వా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
పచ్చి కొబ్బరి ముక్కలు - అర కప్పు
వేయించిన శనగపప్పు(పుట్నాలు)- 1 టేబుల్ స్పూన్
గసగసాలు - 1 టీస్పూన్
జీడిపప్పు - 5
సోంపు - 1 టీస్పూన్
మిరియాలు - అర టీస్పూన్
అల్లం - 1 చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు - 5
నూనె - 4 టేబుల్ స్పూన్లు
దాల్చిన చెక్క-చిన్న ముక్క
లవంగాలు-3
యాలకులు-2
బిర్యానీ ఆకు-1
స్టార్ పువ్వు-1
రాతి పువ్వు -కొంచెం
ఉల్లిపాయలు - 2
టమోటాలు - 2
పచ్చిమిర్చి - 3
పుదీనా - గుప్పెడు
కొత్తిమీర - గుప్పెడు
కారం - ఒకటిన్నర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 4 కప్పులు
కరివేపాకు - రెండు రెమ్మలు
తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి, వేయించిన శనగపప్పు (పుట్నాలు), గసగసాలు, జీడిపప్పు, సోంపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్ పెట్టుకోండి. అందులో నూనె వేసి వేడయ్యాక చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు వేసి వేయించండి. ఇవి వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత గుప్పెడు పుదీనా ఆకులను వేయండి. పుదీనా నూనెలో వేగాక తరిగిన టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి. టమోటాలు గుజ్జుగా మారిన తర్వాత, అందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించండి.
-ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న కొబ్బరి మసాలా పేస్ట్ ను అందులో వేసి 2-3 నిమిషాల పాటు నూనె పైకి తేలే వరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో సుమారు 3 నుండి 4 గ్లాసుల నీళ్లు పోయండి. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మూత పెట్టి మీడియం మంటపై కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు మరిగించాలి.
-చివరగా గరం మసాలా పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి మరో రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. ఆఖరులో గ్రేవీ పైన నూనె తెట్టులా తేలాలి. అంతే పరోఠా షేర్వా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












