Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
రక్తం తక్కువగా ఉందా? వారానికి రెండుసార్లు ఈ చట్నీ తినాల్సిందే..ఇడ్లీ, దోశలోకి కేక
మన పెద్దలు ఆకుకూరలు ఆరోగ్యానికి అమృతం అని ఊరికే అనలేదు. ముఖ్యంగా మన ఇంటి పెరట్లో లేదా తక్కువ ధరకే మార్కెట్లో దొరికే మునగ ఆకు పోషకాల గని. సాధారణంగా మనం మునగ ఆకును పప్పులో వేసుకోవడమో, లేదా ఫ్రై చేసుకోవడమో చేస్తాం. కానీ ఎప్పుడూ ఒకే రకంగా తింటే ఎవరికైనా బోర్ కొడుతుందా? అయితే ఈసారి మునగ ఆకుతో ఎంతో రుచికరమైన, నోరూరించే మునగ ఆకు చట్నీని ట్రై చేయండి.
ఈ రోజుల్లో చాలామంది పిల్లల్లో, చివరకు పెద్దవారిలో కూడా రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఐరన్ టాబ్లెట్లు వాడటం కంటే సహజసిద్ధంగా దొరికే మునగ ఆకును ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా లేదా ఇడ్లీ, దోశ వంటి టిఫిన్స్ లోకి నంజుకు తిన్నా అద్భుతంగా ఉంటుంది. మునగాకు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
మునగ ఆకు: 2 గుప్పెళ్ళు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
పల్లీలు: 1 టేబుల్ స్పూన్
శెనగపప్పు: 1 టేబుల్ స్పూన్
మినప్పప్పు: అర టీస్పూన్
జీలకర్ర: పావు టీస్పూన్
మిరియాలు: పావు టీస్పూన్
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2
ఎండుమిర్చి: 2
చింతపండు: చిన్న ఉసిరికాయంత
పచ్చి కొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
తాలింపు కోసం: ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి.
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె కాగాక పల్లీలు, శెనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి. పప్పులు రంగు మారుతున్నప్పుడు జీలకర్ర, మిరియాలు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే పాన్ లో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చిన్న చింతపండు ముక్క వేసి ఉల్లిపాయలు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.
-ఇప్పుడు పాన్ లో శుభ్రం చేసి పెట్టుకున్న రెండు గుప్పెళ్ళ మునగ ఆకును వేయాలి. మునగ ఆకులో ఉండే వగరు పోవాలంటే అది బాగా వేగాలి. కాబట్టి కనీసం 7 నిమిషాల పాటు సన్నని మంటపై ఆకు పచ్చి వాసన పోయి, మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆపి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-వేయించి చల్లార్చిన పప్పులు, మునగ ఆకు మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. దీనికి పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు జత చేసి మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి, మరీ జారుగా కాకుండా చట్నీలా గట్టిగా రుబ్బుకోవాలి. చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు చిన్న బాండీలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడించి, ఈ తాలింపును చట్నీలో కలపండి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన మునగ ఆకు చట్నీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications




