Latest Updates
-
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు, మరణాల కలకలం.. ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ.! -
భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచే తప్పులు ఇవే.. మనస్పర్థలు తొలగాలంటే ఇలా చేయండి.! -
కూల్ డ్రింక్ సీసాలను ఇలా ఓపెన్ చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా.. ఈ పొరపాట్లు ఇకపై వద్దు.! -
గుత్తి వంకాయతో మసాలా చేసి బోర్ కొడితే ఇలా కొత్తగా ట్రై చేయండి.. వదలకుండా తినేస్తారు.! -
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై వయసు ప్రభావం.. ఎంతవరకు వాస్తవం.? -
పిల్లల ఫేవరెట్ ‘ఆలూ’.. రెస్టారెంట్ టేస్ట్తో అదరగొట్టే దమ్ బిర్యానీ.! -
వర్షాకాలంలో వీటిని తినే ముందు జాగ్రత్త.. లేదంటే వాంతులు, విరేచనాలు తప్పవు.! -
వర్షాకాలంలో జుట్టు విపరీతంగా రాలిపోతోందా? ఇలా చేస్తే నో టెన్షన్ -
చిల్ అవ్వడానికి చోటు ఏదైతేనేం.. భారీ వర్షంలోనూ ‘సిట్టింగ్’.. మందుబాబుల వైరల్ వీడియో.! -
పైన కరకర.. లోపల కరిగే చీజ్.. ఆహా అనిపించే పొటాటో చీజ్ బాల్స్..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
రాగి పొంగలి వారానికి 2 సార్లు తింటే చాలు..కొండలను ఢీకొట్టే శక్తి..ఎలా చేసుకోవాలంటే..
పూర్వకాలం నుండి మన పెద్దలు రాగులను తమ రోజువారీ ఆహారంలో ముఖ్య భాగంగా తీసుకునేవారు. అందుకే వారు వృద్ధాప్యంలో కూడా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. మారుతున్న జీవనశైలి, పాశ్చాత్య ఆహారపు అలవాట్ల కారణంగా మధ్యలో మనం ఈ సంప్రదాయ ఆహారాలకు కాస్త దూరమైనప్పటికీ, నేటి కాలంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా మళ్ళీ అందరూ చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే రాగులతో చేసే వంటకాల్లో రాగి సంగటి, రాగి జావ, రాగి రొట్టెలతో పాటు అత్యంత ప్రాచుర్యం పొందిన, రుచికరమైన వంటకం రాగి పొంగలి.

రాగి పొంగలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఉదయం అల్పాహారంగా లేదా మధ్యాహ్న భోజనంగా కూడా తీసుకోవచ్చు. వారానికి కనీసం రెండు లేదా మూడు సార్లైనా రాగి పొంగలిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం అలవాటు చేసుకుంటే హాస్పిటల్స్ చుట్టూ తిరిగే పనే ఉండదు.
రాగి పొంగలి తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగులు
-పెసరపప్పు
-నీళ్లు
-ఉప్పు
-నెయ్యి
-మిరియాలు
-జీలకర్ర
-అల్లం తరుగు
-పచ్చిమిర్చి
-కరివేపాకు
-జీడిపప్పు
-ఇంగువ
రాగి పొంగలి తయారీ విధానం
-ముందుగా 1కప్పు రాగులను శుభ్రంగా కడిగి అందులో 4 కప్పుల నీళ్లు పోసి 6-7 గంటలు నానబెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 కప్పు పొట్టు లేసి పసుపు రంగు పెసరపప్పు వేసి దోరగా వేయించాక అందులో నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి.
-ఇప్పుడు 7 గంటల పాటు నానిన రాగుల్లో ఇంకో 4 కప్పుల నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి.
-రాగులు బాగా ఉడికిన తర్వాత ఆఖరున అందులో నానిన పెసరపప్పు, ఉప్పు వేసి కలిపి ఇంకో 5 నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద తాలింపు కోసం కడాయి పెట్టి అందులో నెయ్యి లేదా పప్పుల నూనె వేసి అందులో అల్లం తరుగు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఇంగువ, జీడిపప్పు వేసి వేయించాలి.
-వేగిన తాలింపులో రెడీ చేసుకున్న రాగులు పెసరపప్పు మిశ్రమం వేసి కలుపుకోవాలి. అంతే రాగి పొంగలి రెడీ. దీన్ని వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ లేదా సాంబార్ తో కలిపి తింటే దాని రుచి అమృతంలా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications