Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
నోరూరించే పల్లీ ఉండలు..ఏ స్వీట్ అయినా దీని ముందు జుజుబీ..ఎలా చేసుకోవాలంటే..
మనందరి ఇళ్లలో సాయంత్రం వేళల్లో పిల్లలు ఇష్టంగా తినేందుకు రకరకాల స్నాక్స్ తయారు చేస్తుంటారు. వాటిలో తీపి వంటకాలకు ఉండే స్థానం ప్రత్యేకం. అలాంటి కోవకే చెందింది ఈ వేరుశెనగ ఉండ. దీనిని పల్లీ ఉండ అని కూడా పిలుస్తారు. పల్లీ ఉండ పేరు వినగానే చాలు, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి అందరి నోళ్లలో నీళ్లూరుతాయి. ఈ రోజుకీ బేకరీలు, చిన్న చిన్న షాపులల్లో గాజు సీసాలలో భద్రంగా కనిపించే ఈ వేరుశెనగ, బెల్లం ఉండలు పిల్లలను ఎంతగానో ఆకర్షిస్తాయి. కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.
వేరుశెనగలోని ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి శక్తినివ్వగా.. బెల్లంలోని ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. ఇది పిల్లలకు ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఒక సంపూర్ణమైన, బలవర్థకమైన ఆహారం. పైగా దీనిని ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ అద్భుతమైన, కరకరలాడే పల్లీ ఉండలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
పల్లీ ఉండలు తయారీకి కావాల్సిన పదార్థాలు
వేరుశెనగలు (పల్లీలు) - 2 కప్పులు
తురిమిన బెల్లం - 1 కప్పు
నెయ్యి - 2 టీస్పూన్లు
నీళ్లు - పావు కప్పు
పల్లీ ఉండలు తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టి, తక్కువ మంట మీద వేరుశెనగలను దోరగా, మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి, ప్రతీ గింజను రెండు బద్దలుగా చేసుకోవాలి.
-ఇప్పుడు మరొక పాత్రను స్టవ్ మీద పెట్టి అందులో తురిమిన బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగాక దానిని వడకట్టి మళ్లీ అదే పాత్రలో పోసి పాకం పట్టాలి. ఇందులో ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలపాలి.
-పాకం చిక్కబడుతున్నప్పుడు దానిని పరీక్షింఛాలి. ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకుని అందులో ఈ పాకం చుక్క వేస్తే అది కరిగిపోకుండా గట్టి ఉండలా మారాలి (దీనిని ఉండ పాకం అంటారు). అప్పుడే పాకం సరైన దశకు వచ్చినట్లు.
-పాకం సిద్ధమవ్వగానే వెంటనే స్టవ్ ఆపి అందులో వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. బెల్లం పాకం పల్లీలకు పూర్తిగా పట్టేలా కలపాలి.
-ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే, చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని, కావలసిన పరిమాణంలో గట్టిగా నొక్కుతూ ఉండలుగా చుట్టుకోవాలి. పూర్తిగా చల్లారితే ఉండలు చుట్టడం కష్టమవుతుంది.
-అంతే కరకరలాడే తియ్యటి వేరుశెనగ ఉండలు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే నెల రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









