Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
కర్ణాటక స్పెషల్ పీనట్ రైస్..సింపుల్ రెసిపీ,సూపర్ టేస్ట్
ఉదయం లేవగానే చాలామంది తల్లుల్లు ఆలోచన టిఫిన్ ఏం చేయాలి? పిల్లల లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి? రోజువారీ ఇడ్లీ, దోశలు, ఉప్మాలు తిని పిల్లలే కాదు, పెద్దలు కూడా బోర్ ఫీల్ అవుతుంటారు.
ఉదయం హడావిడిలో త్వరగా అయిపోయే, అదే సమయంలో ఆరోగ్యాన్ని ఇచ్చే వంటకం కోసం చూస్తున్నారా? అయితే కర్ణాటక స్టైల్ పీనట్ రైస్ ట్రై చేయాల్సిందే. మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. వేరుశనగల్లో ఉండే ప్రోటీన్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడితే, నువ్వులు, కొబ్బరి ఎముకలకు బలాన్ని ఇస్తాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పీనట్ రైస్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వేరుశనగ గుళ్ళు (పల్లీలు) - 3 టేబుల్ స్పూన్లు
శనగ పప్పు - 2 టీస్పూన్లు
మినప పప్పు - 2 టీస్పూన్లు
నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము లేదా ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 5 (కారానికి తగినట్లు)
జీలకర్ర -అర టీస్పూన్
ధనియాలు - 1 టీస్పూన్
వండిన అన్నం - 4 కప్పులు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
వేరుశనగ గుళ్ళు - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
మినప పప్పు - 1 టీస్పూన్
శనగ పప్పు - ½ టీస్పూన్
ఎండు మిర్చి - 2
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - అర టీస్పూన్
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - సన్నగా తరిగినది
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళను వేసి దోరగా, కరకరలాడే వరకు వేయించుకోవాలి.
-అవి వేగాక అందులోనే శనగ పప్పు, మినప పప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించండి. చివరగా ఎండు మిర్చి, కొబ్బరి వేసి కాసేపు వేయించి స్టవ్ ఆపేయండి.
-వేయించినవి చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె కాగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించండి. అవి కాస్త వేగాక ఆవాలు, జీలకర్ర, మినప పప్పు, శనగ పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేయండి. ఇప్పుడు జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. చివరగా పసుపు వేసి కలపండి.
-ఇప్పుడు తాలింపులో ముందుగా వండి పెట్టుకున్న అన్నం, మనం తయారు చేసుకున్న మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. మంటను సిమ్ లో ఉంచి, అన్నం మెతుకులు విరిగిపోకుండా నెమ్మదిగా కలపండి.
-చివరగా స్టవ్ ఆపేసి, నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలపండి. అంతే పీనట్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications