Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
కర్ణాటక స్పెషల్ పీనట్ రైస్..సింపుల్ రెసిపీ,సూపర్ టేస్ట్
ఉదయం లేవగానే చాలామంది తల్లుల్లు ఆలోచన టిఫిన్ ఏం చేయాలి? పిల్లల లంచ్ బాక్స్ లో ఏం పెట్టాలి? రోజువారీ ఇడ్లీ, దోశలు, ఉప్మాలు తిని పిల్లలే కాదు, పెద్దలు కూడా బోర్ ఫీల్ అవుతుంటారు.
ఉదయం హడావిడిలో త్వరగా అయిపోయే, అదే సమయంలో ఆరోగ్యాన్ని ఇచ్చే వంటకం కోసం చూస్తున్నారా? అయితే కర్ణాటక స్టైల్ పీనట్ రైస్ ట్రై చేయాల్సిందే. మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. వేరుశనగల్లో ఉండే ప్రోటీన్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడితే, నువ్వులు, కొబ్బరి ఎముకలకు బలాన్ని ఇస్తాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే పీనట్ రైస్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
వేరుశనగ గుళ్ళు (పల్లీలు) - 3 టేబుల్ స్పూన్లు
శనగ పప్పు - 2 టీస్పూన్లు
మినప పప్పు - 2 టీస్పూన్లు
నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము లేదా ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 5 (కారానికి తగినట్లు)
జీలకర్ర -అర టీస్పూన్
ధనియాలు - 1 టీస్పూన్
వండిన అన్నం - 4 కప్పులు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
వేరుశనగ గుళ్ళు - 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
మినప పప్పు - 1 టీస్పూన్
శనగ పప్పు - ½ టీస్పూన్
ఎండు మిర్చి - 2
కరివేపాకు - 2 రెమ్మలు
పసుపు - అర టీస్పూన్
నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - సన్నగా తరిగినది
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళను వేసి దోరగా, కరకరలాడే వరకు వేయించుకోవాలి.
-అవి వేగాక అందులోనే శనగ పప్పు, మినప పప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి మంచి సువాసన వచ్చే వరకు వేయించండి. చివరగా ఎండు మిర్చి, కొబ్బరి వేసి కాసేపు వేయించి స్టవ్ ఆపేయండి.
-వేయించినవి చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె కాగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించండి. అవి కాస్త వేగాక ఆవాలు, జీలకర్ర, మినప పప్పు, శనగ పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి తాలింపు వేయండి. ఇప్పుడు జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. చివరగా పసుపు వేసి కలపండి.
-ఇప్పుడు తాలింపులో ముందుగా వండి పెట్టుకున్న అన్నం, మనం తయారు చేసుకున్న మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయండి. మంటను సిమ్ లో ఉంచి, అన్నం మెతుకులు విరిగిపోకుండా నెమ్మదిగా కలపండి.
-చివరగా స్టవ్ ఆపేసి, నిమ్మరసం పిండి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలపండి. అంతే పీనట్ రైస్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications









