Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
ఎండల్లో ఎనర్జీ కావాలా? అయితే ఒంటికి చలవ చేసే ఈ రాగి పాలు తాగాల్సిందే..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
మండుతున్న ఎండలు, ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కబోత.. ఈ వేసవి కాలంలో బయట అడుగుపెట్టాలంటేనే భయపడే పరిస్థితి ఉంటుంది. వేడి వాతావరణం కారణంగా శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు పోయి, మనం త్వరగా అలసిపోతుంటాం. ఈ క్రమంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగినన్ని నీటితో పాటు, చల్లదనాన్ని ఇచ్చే ద్రవ పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. కూల్ డ్రింక్స్ కంటే ఇంట్లో చేసుకునే నేచురల్ డ్రింక్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అలాంటి ఒక అద్భుతమైన, ఆరోగ్యకరమైన పానీయమే రాగి పాలు. రాగులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉండి ఎముకలను దృఢంగా మారుస్తుంది, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది,బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. వేసవిలో శరీరంలోని వేడిని లాగేసి, తక్షణమే చల్లదనాన్ని ఇవ్వడంలో రాగులు అద్భుతంగా పనిచేస్తాయి. అలాంటి రాగులతో ఎంతో రుచికరమైన రాగి పాలు ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
రాగి పిండి - 1 కప్పు
బెల్లం -తగినంత
ఉప్పు - చిటికెడు
జీడిపప్పు - గుప్పెడు
నానబెట్టిన బాదం పప్పులు - 10-15
యాలకుల పొడి - అర టీస్పూన్
కాచి చల్లార్చిన పాలు - 1 గ్లాసు
రాగి పాలు తయారీ విధానం
-ముందుగా రాగి పిండిని జల్లెడ పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో కొద్దిగా నీళ్లు పోసి, ఎక్కడా ఉండలు లేకుండా మెత్తని పేస్ట్ లాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో పోస్తూ.. అడుగు అంటకుండా, ఉండలు కట్టకుండా గరిటెతో నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి.
-పిండి బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానబెట్టిన బాదం పప్పులు (పొట్టు తీసి), జీడిపప్పు, ముందుగా ఉడికించి పెట్టుకున్న రాగి మిశ్రమం వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా బెల్లం, చిటికెడు ఉప్పు, యాలకుల పొడి వేసి మరోసారి మిక్సీ పట్టుకోవాలి.
-చివరగా అందులో ఒక గ్లాసు పాలు పోసి, రెండు సార్లు మిక్సీ తిప్పితే ఎంతో రుచికరమైన, చిక్కటి రాగి పాలు రెడీ అయిపోయినట్లే.
-తయారైన ఈ రాగి పాలను ఒక గ్లాసులోకి తీసుకుని, ఫ్రిజ్ లో పెట్టి చల్లబడిన తర్వాత తాగితే ఆ మజాయే వేరు. ఒకవేళ వెంటనే తాగాలనుకుంటే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని స్వాదించవచ్చు.
-ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా పనిచేసేలా శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






