Latest Updates
-
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే!
Ragi Murukulu: సాంప్రదాయకమైన రాగి మురుకులు.. ఈజీగా ఇలా చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది!
రాగులు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాగి పిండితో చేసే అన్ని రకాల వంటలు చాలా రుచిగా ఉండడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ రాగి పిండితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. అందులో ఒకటి రాగి మురుకులు. కరకరలాడుతూ కాస్త కారంగా, కొంచెం రాగి రుచితో ఉండే ఈ మురుకులు అందరికీ నచ్చేస్తాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అతి తక్కువ సమయంలో ఎంతో సులభంగా ఈ రాగి మురుకులు చేసుకొని ఆస్వాదించేయొచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి మురుకులు తయారీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల రాగి పిండి
- ఒక కప్పు బియ్యం పిండి
- మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న అరకప్పు పుట్నాలు
- ఓక టీస్పూన్ కారం
- ఒక టీస్పూన్ వాము
- పావు కప్పు నువ్వులు
- చిటికెడు ఇంగువ
- రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి
- రుచికి సరిపడా ఉప్పు
- మురుకులు కాల్చుకోవడానికి సరిపడా నూనె
- పిండి కలుపుకోవడానికి సరిపడా నీళ్లు
రాగి మురుకులు తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో రెండు కప్పుల రాగి పిండి పోసుకొని.. పచ్చి వాసన పోయే వరకు ఆ పిండిని వేపుకోవాలి. ఆ తరువాత ఆ కడాయిలో నుంచి పిండి తీసేసి చల్లారేవరకు పక్కన పెట్టుకోవాలి. రాగి పిండి చల్లారిన తరువాత ఒక పెద్ద గిన్నెలో రాగి పిండి పోసుకోవాలి. అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుట్నాలను కూడా వేసుకోవాలి.
ఆ తరువాత బియ్యం పిండి, వాము, కారం, నువ్వులు, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తరువాత వాటన్నిటినీ బాగా కలుపుకోవాలి. అలాగే వేడి చేసిన నెయ్యిని వేసుకొని చేతి వేళ్ళతో బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడానికి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి.
ఆ తరువాత ఆ పిండిని మురుకులు చేసుకునే గొట్టంలో వేసుకోవాలి. మీకు ఇష్టమొచ్చిన బిళ్ళను వినియోగించి మురుకులు ఒత్తుకోవచ్చు. ఒత్తుకున్న మురుకులు మీడియం మంట మీద వేయించుకోవాలి. రెండు వైపులా మురుకులు బాగా వేయించుకోవాలి. మురుకులు బాగా ఫ్రై అయిపోయిన తరువాత, నురగలు తగ్గిపోయాక ఆ మురుకులను బయటికి తీసుకోవచ్చు. ఇలా పిండి మొత్తంతో మురుకులు వేసుకోవాలి. ఆ తరువాత ఆ మురుకులు ఎంచక్కా తింటూ ఎంజాయ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












