Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
Ragi Murukulu: సాంప్రదాయకమైన రాగి మురుకులు.. ఈజీగా ఇలా చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది!
రాగులు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాగి పిండితో చేసే అన్ని రకాల వంటలు చాలా రుచిగా ఉండడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ రాగి పిండితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. అందులో ఒకటి రాగి మురుకులు. కరకరలాడుతూ కాస్త కారంగా, కొంచెం రాగి రుచితో ఉండే ఈ మురుకులు అందరికీ నచ్చేస్తాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అతి తక్కువ సమయంలో ఎంతో సులభంగా ఈ రాగి మురుకులు చేసుకొని ఆస్వాదించేయొచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి మురుకులు తయారీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల రాగి పిండి
- ఒక కప్పు బియ్యం పిండి
- మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న అరకప్పు పుట్నాలు
- ఓక టీస్పూన్ కారం
- ఒక టీస్పూన్ వాము
- పావు కప్పు నువ్వులు
- చిటికెడు ఇంగువ
- రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి
- రుచికి సరిపడా ఉప్పు
- మురుకులు కాల్చుకోవడానికి సరిపడా నూనె
- పిండి కలుపుకోవడానికి సరిపడా నీళ్లు
రాగి మురుకులు తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో రెండు కప్పుల రాగి పిండి పోసుకొని.. పచ్చి వాసన పోయే వరకు ఆ పిండిని వేపుకోవాలి. ఆ తరువాత ఆ కడాయిలో నుంచి పిండి తీసేసి చల్లారేవరకు పక్కన పెట్టుకోవాలి. రాగి పిండి చల్లారిన తరువాత ఒక పెద్ద గిన్నెలో రాగి పిండి పోసుకోవాలి. అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుట్నాలను కూడా వేసుకోవాలి.
ఆ తరువాత బియ్యం పిండి, వాము, కారం, నువ్వులు, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తరువాత వాటన్నిటినీ బాగా కలుపుకోవాలి. అలాగే వేడి చేసిన నెయ్యిని వేసుకొని చేతి వేళ్ళతో బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడానికి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి.
ఆ తరువాత ఆ పిండిని మురుకులు చేసుకునే గొట్టంలో వేసుకోవాలి. మీకు ఇష్టమొచ్చిన బిళ్ళను వినియోగించి మురుకులు ఒత్తుకోవచ్చు. ఒత్తుకున్న మురుకులు మీడియం మంట మీద వేయించుకోవాలి. రెండు వైపులా మురుకులు బాగా వేయించుకోవాలి. మురుకులు బాగా ఫ్రై అయిపోయిన తరువాత, నురగలు తగ్గిపోయాక ఆ మురుకులను బయటికి తీసుకోవచ్చు. ఇలా పిండి మొత్తంతో మురుకులు వేసుకోవాలి. ఆ తరువాత ఆ మురుకులు ఎంచక్కా తింటూ ఎంజాయ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications