Latest Updates
-
వర్షాలొచ్చేశాయ్.. పేరెంట్స్కి అలర్ట్.. మీ పిల్లల స్కూల్ బ్యాగులో ఇవి తప్పనిసరి.! -
సర్వరోగ నివారిణి నేల వేము..ఈ ఆయుర్వేద మూలిక ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు! -
31 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణం.. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి: మీరు ఎంత మారారు? -
సలాడ్, జ్యూస్ లేదా స్టీమింగ్.. బీట్రూట్ను ఎలా తింటే ఎక్కువ లాభాలో తెలుసా.? -
వెల్లుల్లి ఘాటు,టమాటా పులుపు,గుడ్డు కమ్మదనం.. నోరూరించే టమాటా గార్లిక్ ఎగ్ రైస్! -
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు!
Ragi Murukulu: సాంప్రదాయకమైన రాగి మురుకులు.. ఈజీగా ఇలా చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది!
రాగులు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాగి పిండితో చేసే అన్ని రకాల వంటలు చాలా రుచిగా ఉండడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ రాగి పిండితో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. అందులో ఒకటి రాగి మురుకులు. కరకరలాడుతూ కాస్త కారంగా, కొంచెం రాగి రుచితో ఉండే ఈ మురుకులు అందరికీ నచ్చేస్తాయి. వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. అతి తక్కువ సమయంలో ఎంతో సులభంగా ఈ రాగి మురుకులు చేసుకొని ఆస్వాదించేయొచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి మురుకులు తయారీకి కావాల్సిన పదార్థాలు
- రెండు కప్పుల రాగి పిండి
- ఒక కప్పు బియ్యం పిండి
- మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకున్న అరకప్పు పుట్నాలు
- ఓక టీస్పూన్ కారం
- ఒక టీస్పూన్ వాము
- పావు కప్పు నువ్వులు
- చిటికెడు ఇంగువ
- రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి
- రుచికి సరిపడా ఉప్పు
- మురుకులు కాల్చుకోవడానికి సరిపడా నూనె
- పిండి కలుపుకోవడానికి సరిపడా నీళ్లు
రాగి మురుకులు తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో రెండు కప్పుల రాగి పిండి పోసుకొని.. పచ్చి వాసన పోయే వరకు ఆ పిండిని వేపుకోవాలి. ఆ తరువాత ఆ కడాయిలో నుంచి పిండి తీసేసి చల్లారేవరకు పక్కన పెట్టుకోవాలి. రాగి పిండి చల్లారిన తరువాత ఒక పెద్ద గిన్నెలో రాగి పిండి పోసుకోవాలి. అలాగే మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుట్నాలను కూడా వేసుకోవాలి.
ఆ తరువాత బియ్యం పిండి, వాము, కారం, నువ్వులు, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తరువాత వాటన్నిటినీ బాగా కలుపుకోవాలి. అలాగే వేడి చేసిన నెయ్యిని వేసుకొని చేతి వేళ్ళతో బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకోవడానికి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి.
ఆ తరువాత ఆ పిండిని మురుకులు చేసుకునే గొట్టంలో వేసుకోవాలి. మీకు ఇష్టమొచ్చిన బిళ్ళను వినియోగించి మురుకులు ఒత్తుకోవచ్చు. ఒత్తుకున్న మురుకులు మీడియం మంట మీద వేయించుకోవాలి. రెండు వైపులా మురుకులు బాగా వేయించుకోవాలి. మురుకులు బాగా ఫ్రై అయిపోయిన తరువాత, నురగలు తగ్గిపోయాక ఆ మురుకులను బయటికి తీసుకోవచ్చు. ఇలా పిండి మొత్తంతో మురుకులు వేసుకోవాలి. ఆ తరువాత ఆ మురుకులు ఎంచక్కా తింటూ ఎంజాయ్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications