Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
రాజస్థానీ స్టైల్ పచ్చిమిర్చి పచ్చడి..రుచి చూస్తే జన్మలో మర్చిపోలేరు..ఇలా చేస్తే అన్నం, రోటీల్లోకి అదుర్స్!
భారతదేశం విభిన్న సంస్కృతులకు, వంటకాలకు పుట్టినిల్లు. అందులో రాజస్థాన్ రాష్ట్రం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది విశాలమైన ఎడారులు, చారిత్రక కోటలు, వారి ఘాటైన, నోరూరించే వంటకాలు. ఎడారి ప్రాంతం కావడం వల్ల అక్కడ కూరగాయల లభ్యత తక్కువగా ఉంటుంది. అందుకే వారు తమ వంటకాల్లో పప్పులు, సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా పచ్చిమిర్చి, ఎండుమిర్చిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
రాజస్థానీ వంటకాల్లో పచ్చిమిర్చి పచ్చడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం అన్నంలోకే కాకుండా రోటీ, చపాతీ, పరాఠా, రాజస్థానీ స్పెషల్ దాల్ బాటిలోకి అద్భుతమైన కాంబినేషన్. ఈ పచ్చడి భోజనం రుచిని రెట్టింపు చేయడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రాజస్థానీ స్టైల్ పచ్చిమిర్చి పచ్చడిని మీ ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-పచ్చిమిర్చి
-వెల్లుల్లి రెబ్బలు
-శెనగపిండి
-పెరుగు
-అల్లం
-నూనె
-జీలకర్ర
-ఆవాలు
-జీలకర్ర
-ఇంగువ
-పసుపు
-ధనియాలు
-ఉప్పు
-కరివేపాకు
-కొత్తిమీర
తయారీ విధానం
-ముందుగా మీడియం కారం గల 75 గ్రాముల పచ్చిమిరపకాయలను, ఒక చిన్న అల్లం ముక్కను రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి. కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత అందులోనే 15-20 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని కూడా కచ్చాపచ్చాగ దంచుకోండి. మీ దగ్గర రోలు లేకుంటే మిక్సీలోనే చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యండి.
-వేడెక్కిన ఆయిల్ లో ఒక ఎండుమిర్చి ముక్క, ఒక టీస్పూన్ ధనియాలు నలిపి వేయండి, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు వేసి వేయించాలి. జీలకర్ర చిట్లిన తర్వాత ఇందులోనే చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.
-ఇప్పుడు వేగిన తాలిపుంలో కచ్చాపచ్చాగ దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసి వేపండి. ఇలా వేపడం వల్ల మిర్చిలోని ఘాటు మరింతగా తగ్గుతుంది. పచ్చిమిర్చి బాగా వేగి నూనె పైకి తేలాలి.
-నూనె పైకి తేలుతున్నప్పుడు అందులో పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల శెనగపిండి వేసి నిదానంగా వేయించి స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు అర లీటరు పెరుగుని తరకలు లేకుండా బాగా చిలికి అందులో చల్లారిపోయిన మిర్చి మిశ్రమం వేసి బాగా కలిసేలా చిలుక్కోవాలి. చివరగా అందులో కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి. అంతే రాజస్థానీ పచ్చిమిర్చి పచ్చడి రెడీ.
-ఈ పచ్చడిని అన్పంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. దీనిని రోటీ, చపాతీల్లోకి తిన్నా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications