Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
రాజస్థానీ స్టైల్ పచ్చిమిర్చి పచ్చడి..రుచి చూస్తే జన్మలో మర్చిపోలేరు..ఇలా చేస్తే అన్నం, రోటీల్లోకి అదుర్స్!
భారతదేశం విభిన్న సంస్కృతులకు, వంటకాలకు పుట్టినిల్లు. అందులో రాజస్థాన్ రాష్ట్రం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది విశాలమైన ఎడారులు, చారిత్రక కోటలు, వారి ఘాటైన, నోరూరించే వంటకాలు. ఎడారి ప్రాంతం కావడం వల్ల అక్కడ కూరగాయల లభ్యత తక్కువగా ఉంటుంది. అందుకే వారు తమ వంటకాల్లో పప్పులు, సుగంధ ద్రవ్యాలు, ముఖ్యంగా పచ్చిమిర్చి, ఎండుమిర్చిని ఎక్కువగా ఉపయోగిస్తారు.
రాజస్థానీ వంటకాల్లో పచ్చిమిర్చి పచ్చడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం అన్నంలోకే కాకుండా రోటీ, చపాతీ, పరాఠా, రాజస్థానీ స్పెషల్ దాల్ బాటిలోకి అద్భుతమైన కాంబినేషన్. ఈ పచ్చడి భోజనం రుచిని రెట్టింపు చేయడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. రాజస్థానీ స్టైల్ పచ్చిమిర్చి పచ్చడిని మీ ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-పచ్చిమిర్చి
-వెల్లుల్లి రెబ్బలు
-శెనగపిండి
-పెరుగు
-అల్లం
-నూనె
-జీలకర్ర
-ఆవాలు
-జీలకర్ర
-ఇంగువ
-పసుపు
-ధనియాలు
-ఉప్పు
-కరివేపాకు
-కొత్తిమీర
తయారీ విధానం
-ముందుగా మీడియం కారం గల 75 గ్రాముల పచ్చిమిరపకాయలను, ఒక చిన్న అల్లం ముక్కను రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి. కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత అందులోనే 15-20 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని కూడా కచ్చాపచ్చాగ దంచుకోండి. మీ దగ్గర రోలు లేకుంటే మిక్సీలోనే చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చెయ్యండి.
-వేడెక్కిన ఆయిల్ లో ఒక ఎండుమిర్చి ముక్క, ఒక టీస్పూన్ ధనియాలు నలిపి వేయండి, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు వేసి వేయించాలి. జీలకర్ర చిట్లిన తర్వాత ఇందులోనే చిటికెడు ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.
-ఇప్పుడు వేగిన తాలిపుంలో కచ్చాపచ్చాగ దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసి వేపండి. ఇలా వేపడం వల్ల మిర్చిలోని ఘాటు మరింతగా తగ్గుతుంది. పచ్చిమిర్చి బాగా వేగి నూనె పైకి తేలాలి.
-నూనె పైకి తేలుతున్నప్పుడు అందులో పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేయించాలి. ఆ తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ల శెనగపిండి వేసి నిదానంగా వేయించి స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు అర లీటరు పెరుగుని తరకలు లేకుండా బాగా చిలికి అందులో చల్లారిపోయిన మిర్చి మిశ్రమం వేసి బాగా కలిసేలా చిలుక్కోవాలి. చివరగా అందులో కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి. అంతే రాజస్థానీ పచ్చిమిర్చి పచ్చడి రెడీ.
-ఈ పచ్చడిని అన్పంతో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. దీనిని రోటీ, చపాతీల్లోకి తిన్నా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications