Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఇడ్లీ, దోశ, అన్నం దేనికైనా సరే ఈ ఒక్క చట్నీ చాలు.. నెల రోజులు నిల్వ ఉంటుంది
ఉదయం టిఫిన్ లోకి కాస్త భిన్నంగా, కారంగా, పుల్లగా, తియ్యగా.. ఇలా అన్ని రుచుల సమ్మేళనంతో నోరూరించే కారం చట్నీని ప్రయత్నించండి. ఇది కేవలం రుచిలోనే కాదు, నిల్వ ఉండటంలోనూ దీనికి సాటి లేదు. ఈ చట్నీ పది రోజుల నుంచి నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది.
ఈ చట్నీ ఇది వేడి వేడి ఇడ్లీ, మెత్తటి దోశలతోనే కాదు.. పూరీ, చపాతీ, ఊతప్పం వంటి వాటితో కూడా అద్భుతంగా ఉంటుంది. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ చట్నీ కలుపుకుని తిన్నా అద్భుతంగా ఉంటుంది. కారం చట్నీ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
కారం తక్కువగా ఉండే కశ్మీరీ ఎండు మిరపకాయలు- 10
గుంటూరు మిర్చి- 10
చింతపండు - నిమ్మకాయంత
సాంబార్ ఉల్లిపాయలు- 25
వెల్లుల్లి రెబ్బలు - 20
నువ్వుల నూనె - రెండున్నర టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
బెల్లం పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
వేడి నీళ్లు - అర కప్పు
తయారీ విధానం
-ముందుగా రెండు రకాల ఎండు మిరపకాయల తొడిమలు తీసి ఒక గిన్నెలోకి తీసుకోండి. అందులోనే చింతపండు కూడా వేసి అర కప్పు వేడి నీళ్లు పోసి పది నిమిషాల పాటు నానబెట్టండి.
-పది నిమిషాల తర్వాత నానబెట్టిన మిరపకాయలు, చింతపండును నీళ్లతో సహా మిక్సీ గిన్నెలో వేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా జతచేసి మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసి వేడిచేయండి. నూనె వేడెక్కాక అందులో ఆవాలు వేయండి. అవి చిటపటలాడుతుండగా మినపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి.
-పోపు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, సాంబార్ ఉల్లిపాయ ముక్కలు వేసి, పచ్చి వాసన పోయి బంగారు రంగులోకి మారేంత వరకు బాగా వేయించాలి.
-ఉల్లిపాయలు వేగాక అందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న మిరపకాయల పేస్టును వేయండి. మిక్సీ జార్ లో కొద్దిగా నీళ్లు పోసి, దాన్ని కూడా కడాయిలో వేసి బాగా కలపాలి.
-ఇప్పుడు మూత పెట్టి మంటను తగ్గించి 5 నిమిషాల పాటు ఉడికించండి. తర్వాత మూత తీసి కలపండి. చట్నీలోని నీరంతా ఇగిరిపోయి, నూనె పైకి తేలుతున్నప్పుడు, బెల్లం పొడి వేసి కలపాలి. మరో ఐదు నిమిషాలు మూత లేకుండా ఉడికించాలి.
-చట్నీ చిక్కబడి మంచి పరిమళం వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. చివరగా మిగిలిన 1 టేబుల్ స్పూన్ పచ్చి నువ్వుల నూనెను పైన వేసి కలపండి. ఇది చట్నీకి అదనపు రుచిని, సువాసనను ఇవ్వడమే కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది.
-అంతే ఘుమఘుమలాడే కారం చట్నీ రెడీ. దీన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు దీని రుచిని ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications