Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
సేమియా కేసరి.. సంక్రాంతి తీపి మొత్తం ఇందులోనే,ఎలా చేసుకోవాలంటే..
తిని మైమరిచిపోవడం అనే మాట కొన్నింటికే ఆపాదించగలం. ఆ కొన్నింటిలో సేమియా కేసరి ఒకటి. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్న తర్వాత మొత్తం సేమియా నాకే కావాలి అని అంటారు. అంత రుచికరంగా ఉంటుంది. సేమియా కేసరి ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సేమియా కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు,సేమియా కేసరి తయారీ విధానం ఇక్కడ చూడండి.
సేమియా కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు
-1 కప్పు సేమియా
-1 కప్పు పంచదార
-1 కప్పు ఎండు ద్రాక్ష
-1/4 పచ్చ కర్పూరం
-కొంచెం కుంకుమ పువ్వు
-2 కప్పుల నీళ్లు
-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు
-1/4 టేబుల్ స్పూన్ యాలకల పొడి
-4 టేబుల్ స్పూన్ల నెయ్యి
సేమియా కేసరి తయారీ విధానం
-ముందుగా చిటెకెడు కుంకుమ పువ్వులో కొద్దిగా కలర్,నీళ్లు పోసి
పక్కనపెట్టుకోండి.
-పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చెయ్యండి.
-నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు వేసి దోరగా వేగిన తర్వాత ఇందులో ఎండుద్రాక్ష వేసి కొంచెం వేసి పాన్ లో నుంచి వీటిని ఓ బౌల్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు పాన్ లో మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి అందులో సేమియా వేసి ఎర్రగా వేగిన తర్వాత దాన్ని ఓ ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-తర్వాత అదే పాన్ లో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో వేయించిన సేమియా వేసి ఉడికించండి.
-పూర్తిగా ఉడకినవ్వకుండా కాస్త చెమ్మగా ఉండేదాకా ఉడికించాలి. అంటే 99శాతం ఉడకాలి.
-అప్పుడు కప్పు పంచదార అందులో వేసి కరిగించండి.
-తర్వాత కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి దాదాపు 8 నిమిషాల దాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి.
-కాస్త జారుగా ఉన్నప్పుడే అందులో యాలకల పొడి,వేపుకున్న జీడిపప్పు ఎండుద్రాక్షలు, చిటికెడు పచ్చకర్పూరం వేసి కలిపి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ సేమియా కేసరి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












