Latest Updates
-
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!
సేమియా కేసరి.. సంక్రాంతి తీపి మొత్తం ఇందులోనే,ఎలా చేసుకోవాలంటే..
తిని మైమరిచిపోవడం అనే మాట కొన్నింటికే ఆపాదించగలం. ఆ కొన్నింటిలో సేమియా కేసరి ఒకటి. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్న తర్వాత మొత్తం సేమియా నాకే కావాలి అని అంటారు. అంత రుచికరంగా ఉంటుంది. సేమియా కేసరి ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సేమియా కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు,సేమియా కేసరి తయారీ విధానం ఇక్కడ చూడండి.
సేమియా కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు
-1 కప్పు సేమియా
-1 కప్పు పంచదార
-1 కప్పు ఎండు ద్రాక్ష
-1/4 పచ్చ కర్పూరం
-కొంచెం కుంకుమ పువ్వు
-2 కప్పుల నీళ్లు
-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు
-1/4 టేబుల్ స్పూన్ యాలకల పొడి
-4 టేబుల్ స్పూన్ల నెయ్యి
సేమియా కేసరి తయారీ విధానం
-ముందుగా చిటెకెడు కుంకుమ పువ్వులో కొద్దిగా కలర్,నీళ్లు పోసి
పక్కనపెట్టుకోండి.
-పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చెయ్యండి.
-నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు వేసి దోరగా వేగిన తర్వాత ఇందులో ఎండుద్రాక్ష వేసి కొంచెం వేసి పాన్ లో నుంచి వీటిని ఓ బౌల్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు పాన్ లో మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి అందులో సేమియా వేసి ఎర్రగా వేగిన తర్వాత దాన్ని ఓ ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-తర్వాత అదే పాన్ లో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో వేయించిన సేమియా వేసి ఉడికించండి.
-పూర్తిగా ఉడకినవ్వకుండా కాస్త చెమ్మగా ఉండేదాకా ఉడికించాలి. అంటే 99శాతం ఉడకాలి.
-అప్పుడు కప్పు పంచదార అందులో వేసి కరిగించండి.
-తర్వాత కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి దాదాపు 8 నిమిషాల దాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి.
-కాస్త జారుగా ఉన్నప్పుడే అందులో యాలకల పొడి,వేపుకున్న జీడిపప్పు ఎండుద్రాక్షలు, చిటికెడు పచ్చకర్పూరం వేసి కలిపి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ సేమియా కేసరి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












