Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
సేమియా కేసరి.. సంక్రాంతి తీపి మొత్తం ఇందులోనే,ఎలా చేసుకోవాలంటే..
తిని మైమరిచిపోవడం అనే మాట కొన్నింటికే ఆపాదించగలం. ఆ కొన్నింటిలో సేమియా కేసరి ఒకటి. ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకున్న తర్వాత మొత్తం సేమియా నాకే కావాలి అని అంటారు. అంత రుచికరంగా ఉంటుంది. సేమియా కేసరి ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. సేమియా కేసరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు,సేమియా కేసరి తయారీ విధానం ఇక్కడ చూడండి.
సేమియా కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు
-1 కప్పు సేమియా
-1 కప్పు పంచదార
-1 కప్పు ఎండు ద్రాక్ష
-1/4 పచ్చ కర్పూరం
-కొంచెం కుంకుమ పువ్వు
-2 కప్పుల నీళ్లు
-3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు
-1/4 టేబుల్ స్పూన్ యాలకల పొడి
-4 టేబుల్ స్పూన్ల నెయ్యి

సేమియా కేసరి తయారీ విధానం
-ముందుగా చిటెకెడు కుంకుమ పువ్వులో కొద్దిగా కలర్,నీళ్లు పోసి
పక్కనపెట్టుకోండి.
-పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చెయ్యండి.
-నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు వేసి దోరగా వేగిన తర్వాత ఇందులో ఎండుద్రాక్ష వేసి కొంచెం వేసి పాన్ లో నుంచి వీటిని ఓ బౌల్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు పాన్ లో మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసి అందులో సేమియా వేసి ఎర్రగా వేగిన తర్వాత దాన్ని ఓ ప్లేట్ లోకి తీసి పక్కనపెట్టుకోండి.
-తర్వాత అదే పాన్ లో రెండు కప్పుల నీళ్లు పోసి మరిగించండి. నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో వేయించిన సేమియా వేసి ఉడికించండి.
-పూర్తిగా ఉడకినవ్వకుండా కాస్త చెమ్మగా ఉండేదాకా ఉడికించాలి. అంటే 99శాతం ఉడకాలి.
-అప్పుడు కప్పు పంచదార అందులో వేసి కరిగించండి.
-తర్వాత కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి దాదాపు 8 నిమిషాల దాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి.
-కాస్త జారుగా ఉన్నప్పుడే అందులో యాలకల పొడి,వేపుకున్న జీడిపప్పు ఎండుద్రాక్షలు, చిటికెడు పచ్చకర్పూరం వేసి కలిపి 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే టేస్టీ సేమియా కేసరి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications